...
...
Next Story

BRAOU Bed Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు

BRAOU Bed Notification 2026 : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్‌ (ఓడీఎల్) అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు.

Published on: Jul 8, 2026, 12:44:28 IST
Advertisement

BRAOU Bed Notification 2026 : ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) మంచి అవకాశం కల్పించింది. విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎడ్‌ (ఓడీఎల్‌ - ఓపెన్‌ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) ప్రవేశాల అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ నోటిఫికేషన్ విడుదల
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజుగా రూ.1,000 నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రాయితీ కల్పించారు. వీరు రూ.750 ఫీజును ఆన్‌లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల ద్వారా చెల్లిస్తే సరిపోతుంది.

ఆగస్టు మొదటి వారంలో (ఆగస్టు 2న) రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లో ఈ బీఎడ్‌ అర్హత పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-23680333 హెల్ప్‌లైన్ నంబరులో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

  • సాధారణ ఫీజుతో దరఖాస్తుకు ఆఖరి తేదీ : 24-07-2026
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు : 26-07-2026
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం : 29-07-2026
  • ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ : ఆగస్టు మొదటి వారం (ఆగస్టు 2)
  • ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ : ఆగస్టు రెండో వారం
  • అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ : ఆగస్టు రెండో వారం నుంచి మొదలవుతుంది.

కోర్సు కాలవ్యవధి కనీసం 2 విద్యాసంవత్సరాలు, గరిష్టంగా 4 విద్యాసంవత్సరాలుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిగా తెలుగు మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పరీక్షలు, అసైన్‌మెంట్లు, రికార్డులు అన్నీ తెలుగులోనే రాయాల్సి ఉంటుంది.రెండేళ్ల కోర్సుకు గాను మొత్తం రూ.40,000 ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe