KCR Speech : అధికారంలోకి వచ్చాక హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం : కేసీఆర్ సంచలన కామెంట్స్
KCR Speech : హైడ్రాపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక హైడ్రాను తీసేస్తామని చెప్పారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ బాస్ కేసీఆర్.. కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడారు.

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి
'జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారంటేనే ఊపు వస్తుంది. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలి. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. ఆరు నూరైనా నూటికి నూటి శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా జీవన్ రెడ్డి అనేక పదవులు, సేవలు అందిస్తారు.' అని కేసీఆర్ అన్నారు.
45 ఏళ్ల నుంచి తాము స్నేహితులమని కేసీఆర్ చెప్పారు. భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశామన్నారు. బాధలు, సుఖాలు, అభిప్రాయలను పంచుకునేవాళ్లమన్నారు. జీవన్ రెడ్డికి ఉండే నిబద్ధత, ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎందరికో ఆదర్శమన్నారు. జీవన్ రెడ్డి ఒక్క జగిత్యాలలోనే కాదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, పొరుగున ఉన్న అనేక జిల్లాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు.
నా వయసు 72.. పోరాటం ఆగదు!
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "జీవన్ రెడ్డి గారికి 75 ఏళ్లు, నాకు 72 ఏళ్లు. మనకేం ముసలితనం రాలేదు. మన వయసు 25 ఏళ్లు తగ్గిందని భావించి, యువకుల్లా పోరాడదాం.' అని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతికే వరకు తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైడ్రాపై కేసీఆర్ ఫైర్
హైడ్రాపై ఈ సందర్భంగా కేసీఆస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా పనికివస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. హైడ్రాను ఎత్తి అవతలపడేస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'హైడ్రా'పై కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ అందానికి బోడి హైడ్రా ఒకటా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మూసీ ప్రాజెక్ట్ దందా?
మూసీ ప్రక్షాళన పేరుతో 15 వేల ఇళ్లు కూలగొట్టడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందా అని ఆరోపించారు. తమ హయాంలో 46 వేల చెరువులను బాగు చేశామని, కానీ ఒక్క గుడిసెను కూడా తాకలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం సంతోషంగా లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, ఆటో కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరి జీవితం ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము ఇంటింటికి నల్లా నీరు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ నీటి కష్టాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


