తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చాాలా చోట్ల చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని.. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.
మార్జిన్ పెంచాలని డిమాండ్…

హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా చికెన్ షాపులు మూసివేశారు. పౌల్ట్రీ కంపెనీలు.. 26 రూపాయలు ఉన్న మార్జిన్ను 10 రూపాయలు తగ్గించాయని చికెన్ షాపుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తగ్గించిన మార్జిన్ను పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధిక బంద్ చేయాలని పిలుపునిచ్చాయి. తమ బాధను అర్థం చేసుకుని.. చికెన్ ప్రియులు సహకరించాలని చికెన్ షాపుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ మూసివేశారు.
మెజార్టీ చోట్ల షాపులు మూసివేసి ఉండగా… కొన్ని ప్రాంతాల్లో స్నేహ పౌల్ట్రీ అవుట్లెట్లు తెరిచి ఉంచారు. దీంతో ఇతర చికెన్ షాప్ యాజమాన్యాలు స్నేహ అవుట్లెట్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పరిధిలోని కర్మాన్ ఘాట్ లో ఓ ఔట్ లేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా…. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఇరువర్గాలను సముదాయించి… గొడవ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫౌల్ట్రీ కంపెనీలు వెనక్కి తగ్గాలని… మార్జిన్ విషయంలో సానుకూలంగా స్పందించాలని యాజమానులు కోరుతున్నారు. చిన్న వ్యాపారులను ఆదుకునే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
{{/usCountry}}ఫౌల్ట్రీ కంపెనీలు వెనక్కి తగ్గాలని… మార్జిన్ విషయంలో సానుకూలంగా స్పందించాలని యాజమానులు కోరుతున్నారు. చిన్న వ్యాపారులను ఆదుకునే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
{{/usCountry}}తమ సమస్యలను పరిష్కరించే వరకు దుకాణాలను తిరిగి తెరవబోమని దుకాణ యజమానులు స్పష్టం చేశారు. తమ ఆందోళనలకు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చికెన్ షాపులు బంద్ కావటంతో…. బిర్యానీ పాయింట్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడనుంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఉండగా… చికెన్ షాపుల బంద్ తో తీవ్ర ప్రభావం పడనుంది