Chicken Price : పెరిగిన చికెన్, మటన్ ధరలు.. కేజీ ఎంత ఉందో తెలుసా?
Chicken Price : చికెన్, మటన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారం మీద ప్రభావం పడుతోంది. జనాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
తెలంగాణలో మాంసం ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కోడి మాంసం రూ.400, మటన్ ధర రూ.1,200లకు పెరిగాయి. వీక్లీ ఎఫెక్ట్ కూడా మాంసం ధరలపై పడుతోంది. సాధారణంగా ఆదివారాల్లో రద్దీగా ఉండే మార్కెట్లకు మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారు మాంసం కొనడానికి ఇబ్బంది పడటంతో చాలా ప్రదేశాల్లో కస్టమర్లు తగ్గారు.

మాంసం ధరల పెరుగుదలకు డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసమే కారణంగా కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్, రంజాన్ మాసంలో డిమాండ్ అధికంగా ఉండగా.. వేసవి తాపం సరఫరాను ప్రభావితం చేసింది. తీవ్రమైన వేడిగాలుల కారణంగా కోళ్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని పౌల్ట్రీ రైతులు తెలిపారు. దీంతో నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు చూస్తున్నారు.
కొన్ని రోజుల కిందట కిలో రూ.280గా ఉన్న స్కిన్లెస్ చికెన్.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కిలోకు రూ.380 నుంచి రూ.400 ధరకు అమ్ముడవుతోంది. ఇతర రకాల మాంసం ధరలు కూడా పెరిగాయి. నాటు కోడి కిలో రూ.800కు అమ్ముడవుతుండగా, మటన్ ధర నెల రోజుల్లోనే కిలో రూ.900 నుంచి రూ.1,200కు పెరిగింది.
కిలో చికెన్ ధర 400 రూపాయలు ఉండటంతో సామాన్యులకు కష్టంగా ఉందని పలువురు చెబుతున్నారు. కానీ ఈ ధరలతో మాంసానికి బదులుగా గుడ్లు లేదా చేపలు కొనడం వైపూ చూస్తున్నారు జనాలు. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపిందని చిల్లర వ్యాపారులు తెలిపారు.
సాధారణంగా ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వినియోగదారులు కేవలం చికెన్, మటన్ రేటు అడిగి వెళ్లిపోతున్నారు. ఎండ తీవ్రతతో కోళ్లు చనిపోతున్నాయి. ధరలతో వ్యాపారం మీద కూడా ప్రభావం పడుతోంది. అయితే ఇంకా ఇది మార్చి నెలనే కావడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


