AP TG Chicken Prices : కేజీ చికెన్ రూ. 350 - భారీగా పెరిగిన ధరలు..! మరింత పెరిగే ఛాన్స్
AP Telangana Chicken Prices : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. స్కిన్ లెస్ కేజీ చికెన్ ధర రూ. 340 నుంచి 350 మధ్య ఉంది. దీంతో చికెన్ సెంటర్ల వద్ద పెద్దగా రద్దీ ఉండటం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. కొద్దిరోజులుగా క్రమంగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఓవైపు కోడిగుడ్ల ధరలు తగ్గుతుంటే మరోపక్క చికెన్ ధరలు ఊహించని విధంగా పెరిగింది

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో కేజీ చికెన్(స్కిన్ లెస్) ధర రూ. 340 నుంచి రూ. 350కి రూపాయలకు చేరింది. ఈస్థాయి మార్కును దాటడంతో సామాన్యులు చికెన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఇదే ధరకు అర కిలో దాకా మటన్ వస్తుంది కాదా అని భావిస్తూ… వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇక స్కిన్ అయితే కేజీ ధర రూ. 320 వరకు పలుకుతోంది.
కారణాలేంటి..?
పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పైగా వేసవి కావటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో కోళ్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి కారణాలతో మార్కెట్లో చికెన్కు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కిలో చికెన్ ధర రూ. 380 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత కొనుగోళ్లపై హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కోళ్ల ఉత్పత్తి సరిగా లేదని… ఆశించిన స్థాయిలో సరఫరా కూడా జరగటం లేదని చెప్పారు. కిలో రూ. 350కి చేరటంతో వినియోగదారులు కొనుగోలు చేయటంలో వెనకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే… ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

