2027 జూన్లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.

2027 జూన్ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అందుకోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం రేవంత్ కీలక సూచనలు…
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చే 15 లేదా 20 రోజుల్లో నివేదికను సమర్పించాలని చెప్పారు.
ఇంజినీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి… పూర్తి అంచనాలతో నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలన్నారు. ఉప సంఘం ఆమోదించిన తర్వాత గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈ సందర్భంగా అధికారులు వివరించగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
తరుచుగా అడిగే ప్రశ్నలు(FAQ):
ప్రశ్న : గోదావరి పుష్కరాలు ఏంటి..? ఎప్పుడు నిర్వహిస్తారు..?
{{/usCountry}}బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈ సందర్భంగా అధికారులు వివరించగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
తరుచుగా అడిగే ప్రశ్నలు(FAQ):
ప్రశ్న : గోదావరి పుష్కరాలు ఏంటి..? ఎప్పుడు నిర్వహిస్తారు..?
{{/usCountry}}ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి జరిగే పవిత్రమైన ఉత్సవమే గోదావరి పుష్కరాలు. ఈ సమయంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ 12 రోజుల పండుగను "ఆది పుష్కరాలు" అని పిలుస్తారు.
ప్రశ్న : గోదావరి పుష్కరాలను ఏఏ రాష్ట్రాల్లో ఉంటాయి..?
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా పుష్కరాలు జరుగుతాయి. గోదావరి నది ప్రవహించే మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ పుష్కర వేడుకలు ఉంటాయి.
ప్రశ్న : గోదావరి పుష్కరాలు మళ్లీ ఎప్పుడు జరగనున్నాయి..?
తదుపరి గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు జరగనున్నాయి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.