...
...
Next Story

Godavari Pushkaralu : బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్ల అభివృద్ధి - పుష్కరాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Godavari Pushkaralu in Telangana : గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు.

Published on: Mar 30, 2026, 06:04:59 IST
Advertisement

2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

2027 జూన్ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అందుకోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.

సీఎం రేవంత్ కీలక సూచనలు…

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చే 15 లేదా 20 రోజుల్లో నివేదికను సమర్పించాలని చెప్పారు.

ఇంజినీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి… పూర్తి అంచనాలతో నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలన్నారు. ఉప సంఘం ఆమోదించిన తర్వాత గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి జరిగే పవిత్రమైన ఉత్సవమే గోదావరి పుష్కరాలు. ఈ సమయంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ 12 రోజుల పండుగను "ఆది పుష్కరాలు" అని పిలుస్తారు.

ప్రశ్న : గోదావరి పుష్కరాలను ఏఏ రాష్ట్రాల్లో ఉంటాయి..?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా పుష్కరాలు జరుగుతాయి. గోదావరి నది ప్రవహించే మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ పుష్కర వేడుకలు ఉంటాయి.

ప్రశ్న : గోదావరి పుష్కరాలు మళ్లీ ఎప్పుడు జరగనున్నాయి..?

తదుపరి గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు జరగనున్నాయి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe