హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3 మెయిన్ పైప్లైన్లో భారీ లీకేజీ ఏర్పడింది. దీన్ని అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా మరోవైపు తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు.

ఈ పనులు ఇవాళ(శనివారం) రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని హైదరాబాద్ జలమండలి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
- డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.
- డివిజన్–9: కేపీహెచ్బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.
- డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.
- డివిజన్–17: గోపాల్ నగర్.
- డివిజన్–22: తెల్లాపూర్.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. పొదుపుగా నీటిని వాడుకోవాలని పేర్కొన్నారు.మరమ్మతు పనులు పూర్తి కాగానే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వివరించారు.