మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మెుదలైంది. మహా జాతర ఊపందుకుంటున్న సమయంలో భక్తుల దగ్గర వ్యాపారులు దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారీ రద్దీని ఆసరాగా చేసుకుని స్థానిక విక్రేతలు, సీజనల్ వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. భక్తులు అవసరాల కోసం అధిక ధరలు చెల్లించడం తప్ప వేరే మార్గం లేకుండా పోతోంది.

పూజా సామాగ్రి, ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెంచేశారు. సాధారణంగా తక్కువ ధరకు లభించే బంగారం(బెల్లం) ఇప్పుడు కిలోకు రూ. 100 వరకు అమ్ముతున్నారు కొందరు. లీటరు వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ. 30కి అమ్ముడవుతున్నాయి. దీని ఎంఆర్పీ రూ.20 మాత్రమే. అంటే పది రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
యువత బైక్ టాక్సీ సేవలను కూడా ప్రవేశపెట్టారు. మేడారం ప్రాంతంలో ఎక్కడకు వెళ్లినా.. రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. చలి వాతావరణం చాలా మందికి అసౌకర్యంగా ఉండటంతో జంపన్న వాగులో స్థానికులు నది ఒడ్డున కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. రూ.50కి వేడి నీటిని బకెట్లలో అమ్ముతున్నారు. ఇది లాభదాయకమైన వ్యాపారంగా మారింది. చిన్న పిల్లలకు ఈ వేడి నీరు కొని స్నానాలు చేయిస్తున్నారు.
చెట్ల నీడను కూడా అమ్ముకుంటున్నట్టుగా ఇప్పటికే HT Telugu ఆర్టికల్ పబ్లిష్ చేసింది. భారీగా భక్తులు వస్తుండటంతో విశ్రాంతి తీసుకోవడానికి శుభ్రమైన, నీడ ఉన్న ప్రదేశాలకు డిమాండ్ పెరిగింది. వచ్చేవారు ఆ చెట్ల కింద వంట చేసుకుంటున్నారు. స్థానికులు చెట్లను అద్దెకు ఇస్తున్నారు. కొన్ని గంటలు లేదా రోజు లెక్కన ఇవి ఉంటాయి. రూ. 500 నుండి రూ. 1,000 వరకు వసూలు చేస్తున్నారు.
స్థలాల అద్దెలలో కూడా అధిక ధరలు ఉన్నాయి. గతంలో రూ.3,500 నుండి రూ.4,000 వరకు ఖర్చయ్యే ఒక చదరపు గజ దుకాణ స్థలం ఇప్పుడు రూ.8,000 నుండి రూ.10,000 వరకు పెరిగింది. దీంతో వ్యాపారులు ఇలా చేయాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.
{{/usCountry}}స్థలాల అద్దెలలో కూడా అధిక ధరలు ఉన్నాయి. గతంలో రూ.3,500 నుండి రూ.4,000 వరకు ఖర్చయ్యే ఒక చదరపు గజ దుకాణ స్థలం ఇప్పుడు రూ.8,000 నుండి రూ.10,000 వరకు పెరిగింది. దీంతో వ్యాపారులు ఇలా చేయాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.
{{/usCountry}}ఇక మేడారం జాతరలో మాంసం ధరలు మరింత పెరిగాయి. మేడారం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మటన్ కిలోకు రూ.1,200 కు అమ్ముడవుతోంది. బోన్లెస్ అయితే రూ.1,400 వరకు ధర పలుకుతున్నాయి. చికెన్ ధరలు కిలోకు రూ.400 దాటాయి. డిమాండ్ పెరగడం, కోళ్ల సరఫరాలో తాత్కాలిక తగ్గుదల దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఈ పెరుగుదలపై భక్తులు అసంతృప్తితో ఉన్నారు. మొదటిసారి వచ్చే భక్తులు అధిక ఛార్జీలు పడకుండా ఉండటానికి స్వంత ఆహారం, పూజ సామగ్రి, నీటిని తీసుకెళ్లాలని పలువురు చెబుతున్నారు. లేదంటే మేడారం వెళ్లే మార్గంలో పట్టణాల నుండి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.