...
...
Next Story

Hyderabad : జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం - కాలి బూడిదైన షాపింగ్ మాల్...!

జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 36 లోని మాంగళ్య గౌరి షాపింగ్ మాల్ లో భారీగా మంటలు చెలరేగాయి. బట్టల మాల్ కావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. షో రూమ్ బయట ఉన్న సెట్ పూర్తిగా మంటలు కాలిపోయింది.

Published on: Feb 26, 2026, 13:54:02 IST
Advertisement

జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ సెట్ అంతా కూడా కాలిపోయింది. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం
జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం

"ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. మంటలు అదుపులోకి వచ్చాయి. 4వ అంతస్తులోని భవనం నుంచి పొగ మాత్రమే వెలువడుతోంది. భవనంలో ఎవరూ లేరు' అని జిల్లా అగ్నిమాపక అధికారి-2 (డీఎఫ్ఓ-2) అజ్మీరా శ్రీదాస్ తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ… మంగళ్య గౌరి చీర షోరూమ్ లో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. లోపల 10 మంది పని చేస్తున్నారని…. కానీ మంటలు చెలరేగినప్పుడు వారు భవనం నుండి బయటకు వచ్చారని వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe