తెలుగు జానపద రంగలో తన డ్యాన్స్ తో ఓ ఊపు ఊపేస్తున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా ఫోక్ డ్యాన్సర్తో అక్రమ సంబంధం పెట్టుకుని…. ఒక గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరినీ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
భార్య ఎంట్రీతో…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి తనతో కలిసి అనేక ఫోక్ సాంగ్స్లో నటించిన నటి మాధురి రాథోడ్తో కలిసి ఏకాంతంగా గడుపుతున్నారు. ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అకస్మాత్తుగా గదిలోకి వెళ్లి వారిద్దరినీ పట్టుకున్నారు. వీడియోలో మాధురి రాథోడ్ బెడ్పై కూర్చుని ఉండగా…. ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య శరణ్య గదిలోనే వారిద్దరిపై దాడి చేశారు. ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కాంబినేషన్లో వచ్చిన చాలా జానపద గేయాలు యూట్యూబ్లో రికార్డు వ్యూస్ సాధించి సూపర్ హిట్ అయ్యాయి. 'రాతిరి రాతిరి రాతిరిలో..', 'సీటి సీర..', 'లాయి లాయి లబ్బరు బొమ్మ..', 'ప్రమీల ఓ ప్రమీల' లాంటి పాటలు ఈ జంటకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇటీవల వచ్చిన 'బాసింగ బాసింగ బలాలే' సాంగ్ అయితే యూట్యూబ్ను షేక్ చేసింది. రీల్స్లో, పాటల్లో జంటగా మెరిసి ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఇప్పుడు ఇలా ఏకాంతంగా దొరికిపోవడం ఫోక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
పోలీసులను ఆశ్రయించిన భార్య…
ఈ ఘటనపై బాధితురాలు శరణ్య వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త ఈశ్వర్ సాయి, నటి మాధురి రాథోడ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు విచారిస్తున్నారు.
{{/usCountry}}ఈ ఘటనపై బాధితురాలు శరణ్య వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త ఈశ్వర్ సాయి, నటి మాధురి రాథోడ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు విచారిస్తున్నారు.
{{/usCountry}}ఈ వ్యవహారంపై భార్య శరణ్య మీడియా ముందు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. తమ వివాహం జరిగి ఏడేళ్లు అవుతోందని…. తన భర్తకు తాగే అలవాటు కూడా లేదని చెప్పారు. "గతంలో మాధురి రాథోడ్కు బ్రేకప్ అయినప్పుడు నేనే స్వయంగా వెళ్లి ఓదార్చాను. మా కళ్ల ముందే తిరిగే ఆ అమ్మాయి చాలా మంచిది అనుకున్నాను. కానీ నా పక్కనే ఉంటూ నా సంసారాన్ని ఇలా కూలుస్తుందని అసలు ఊహించలేదు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ మెసేజ్లు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను," అని కన్నీరుమున్నీరయ్యారు.
భర్త ద్రోహాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మంచివాడేనని, ఇతర మహిళల ప్రవర్తన వల్లే ఇలాంటి దారి పట్టాడని ఆరోపించారు. కుటుంబాలను కూల్చే ఇలాంటి వ్యక్తులను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు.