తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో తన డ్యాన్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు తక్షణమే స్పందించి గది తలుపులు బద్దలుగొట్టి ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాద ఘటన వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తోటి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దారుణంగా మోసం చేశాడని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టుగా ఆరోపణలు చేసింది.
ఈ మోసంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మాధురి రాథోడ్ వాపోతోంది. న్యాయం జరగకపోవడం, సమాజంలో ఎదురవుతున్న అవమానాలు, పోలీసుల అలసత్వంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా వేరే దారి లేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు మాధురి బంధువులు చెబుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జానపద పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మాధురి రాథోడ్ విస్తృతమైన గుర్తింపు పొందింది. న్యాయం కోసం పోరాడాల్సిన సమయంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం బాధాకరమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది మాధురి.
తెలుగు జానపద కళారంగంలో నృత్య కళాకారిణి మాధురి రాథోడ్, తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయిల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మించి దారుణంగా మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ చేసిన ఆరోపణలు చేసింది. అంతకుముందు వీరుద్దరూ కలిసి ఒక గదిలో ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య వెళ్లింది. ఆ సమయంలో తీసిన వీడియో సంచలనమైంది. ఈ ఎపిసోడ్లో ఈశ్వర్ సాయి భార్య కెమెరా ముందు మాట్లాడిన మాటలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.
జానపద పాటల ఆల్బమ్స్, స్టేజ్ షోల ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేసే క్రమంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి తనతో బంధాన్ని కొనసాగించాడని, తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడని మాధురి ఆరోపిస్తోంది.
{{/usCountry}}జానపద పాటల ఆల్బమ్స్, స్టేజ్ షోల ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేసే క్రమంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి తనతో బంధాన్ని కొనసాగించాడని, తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడని మాధురి ఆరోపిస్తోంది.
{{/usCountry}}