ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ నిధుల కిందకు వచ్చే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి, పేద, వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది.

విజిలెన్స్ బృందాలు తెలంగాణ అంతటా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, B.Ed కోర్సులను అందించే ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తనిఖీ చేస్తాయి. ఈ తనిఖీలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీసు కమిషనరేట్ల మద్దతుతో నిర్వహిస్తారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3 నుండి నిరవధిక సమ్మెకు దిగాలని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీల నిర్ణయం తీసుకోవడంపై చర్చ నడుస్తోంది.
విద్యార్థులకు ePASS వ్యవస్థ కింద ఉద్దేశించిన స్కాలర్షిప్ నిధులను కొన్ని విద్యా సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ప్రభుత్వానికి నివేదికలు అందాయని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ నిధులు ఆర్థికంగా బలహీన వర్గాల నుండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ట్యూషన్, నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి అని అధికారులు చెప్పారు.
కళాశాలలు నిజంగా పనిచేస్తున్నాయా, స్కాలర్షిప్ లబ్ధిదారులకు సరైన ప్రవేశం, అర్హత ఉందా, తగినంత బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారా అని తనిఖీ బృందాలు ధృవీకరిస్తాయి. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు విద్యా పనితీరు, హాజరు, విశ్వవిద్యాలయ గుర్తింపు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా వారు అంచనా వేస్తాయి.
ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖల అధికారులు తనిఖీ బృందాలతో పాటు రావాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తారు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికలు, సిఫార్సులను సమర్పిస్తారు. తనిఖీల సమయంలో విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖల అధికారులు తనిఖీ బృందాలతో పాటు రావాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తారు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికలు, సిఫార్సులను సమర్పిస్తారు. తనిఖీల సమయంలో విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}