ప్రైవేట్ కాలేజీలకు ఝలక్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ తనిఖీలు!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు చేయనుంది.

Published on: Oct 30, 2025 10:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల కిందకు వచ్చే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి, పేద, వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

విజిలెన్స్ బృందాలు తెలంగాణ అంతటా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, B.Ed కోర్సులను అందించే ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తనిఖీ చేస్తాయి. ఈ తనిఖీలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీసు కమిషనరేట్ల మద్దతుతో నిర్వహిస్తారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3 నుండి నిరవధిక సమ్మెకు దిగాలని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీల నిర్ణయం తీసుకోవడంపై చర్చ నడుస్తోంది.

విద్యార్థులకు ePASS వ్యవస్థ కింద ఉద్దేశించిన స్కాలర్‌షిప్ నిధులను కొన్ని విద్యా సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ప్రభుత్వానికి నివేదికలు అందాయని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ నిధులు ఆర్థికంగా బలహీన వర్గాల నుండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ట్యూషన్, నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి అని అధికారులు చెప్పారు.

కళాశాలలు నిజంగా పనిచేస్తున్నాయా, స్కాలర్‌షిప్ లబ్ధిదారులకు సరైన ప్రవేశం, అర్హత ఉందా, తగినంత బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారా అని తనిఖీ బృందాలు ధృవీకరిస్తాయి. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు విద్యా పనితీరు, హాజరు, విశ్వవిద్యాలయ గుర్తింపు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా వారు అంచనా వేస్తాయి.

ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖల అధికారులు తనిఖీ బృందాలతో పాటు రావాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తారు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికలు, సిఫార్సులను సమర్పిస్తారు. తనిఖీల సమయంలో విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం తెలిపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More