వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మెుంథా తుపాను ప్రభావంతో భారీగా వర్షం పడి వరంగల్, హన్మకొండ నగరాలను జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇంకా వరద నీరు బయటకు వెళ్లలేదు. పలు ప్రాంతాల్లో అయితే అడుగు తీసి బయటపెట్టే పరిస్థితి లేదు.

మోంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరంగల్, హన్మకొండలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి, ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద నీరు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహించింది.
వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 45 ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయని, దీనితో పరిపాలన పెద్ద ఎత్తున తరలింపు, పునరావాస చర్యలను ప్రారంభించామని చెప్పారు. విపత్తు ప్రతిస్పందన దళం, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను సహాయక చర్యలు చేపట్టడానికి నియమించినట్లు వెల్లడించారు.
లోతట్టు ప్రాంతాల నుండి సుమారు 1,200 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్ తెలిపారు. వరదల వల్ల నిరాశ్రయులైన వారికి వసతి కల్పించడానికి నగరం అంతటా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీటితో నిండిన కాలనీల్లోని వారి సేఫ్టీని నిర్ధారించడానికి బృందాలను పంపించారు.
వరంగల్లోని సుమారు 30 కాలనీలు, హన్మకొండలోని 15 కాలనీలు నీట మునిగాయి. సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలలో తీవ్రంగా నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హంటర్ రోడ్డులోని బొంధి వాగు పొంగిపొర్లడంతో వరంగల్, హన్మకొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డులో నీటి మట్టం పెరగడంతో వాహనాలు వెళ్లడానికి వీలు కాలేదు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీలలో చిక్కుకున్న నివాసితులను రక్షించడానికి పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది తాళ్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ వైపున కూడా భారీ వరద నీరు రోడ్లపై పారింది. వడ్డేపల్లి కూడా తీవ్రంగా ప్రభావితమైంది.
{{/usCountry}}హంటర్ రోడ్డులోని బొంధి వాగు పొంగిపొర్లడంతో వరంగల్, హన్మకొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డులో నీటి మట్టం పెరగడంతో వాహనాలు వెళ్లడానికి వీలు కాలేదు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీలలో చిక్కుకున్న నివాసితులను రక్షించడానికి పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది తాళ్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ వైపున కూడా భారీ వరద నీరు రోడ్లపై పారింది. వడ్డేపల్లి కూడా తీవ్రంగా ప్రభావితమైంది.
{{/usCountry}}భద్రకాళి చెరువు పొంగిపొర్లడంతో ఆలయ ప్రాంతం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు వరద నీరు వచ్చింది. చిన్న చెరువులు కూడా పొంగిపొర్లడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇంకా వరంగల్, హన్మకొండ నగరాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.