...
...
Next Story

పల్లెబాటలో నగరవాసులు - హైదరాబాద్ లో భారీగా వాహనాల రద్దీ..!

సంక్రాంతి పండగ వేళ నగరంలో ఉంటున్న చాలా మంది సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలో గత రెండు రోజులుగా భారీగా వాహనాల రద్దీ నెలకొంది. కీలకమైన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది.

Published on: Jan 11, 2026, 07:48:18 IST
Advertisement

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేలాది మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. పాఠశాలలకు సెలవులు రావటంతో… రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నగరం నుంచి బయటకు వెళ్ళే రహదారులు రద్దీగా ఉంటున్నాయి.

హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ
హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరుకు చెందిన వేలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. ఫలితంగా అనేక కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నగరంలోని ప్రధాన నిష్క్రమణ మార్గాలలో ఒకటైన ఎల్బీ నగర్ లో తెల్లవారుజాము నుంచే భారీ ట్రాఫిక్ నెలకొంటోంది.

ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వి.శ్రీనివాసులు మాట్లాడుతూ… మునుపటి సంవత్సరాల్లో కనిపించిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

"ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు అమలు చేయబడ్డాయి. అడ్డంకులను తగ్గించడానికి, రాంగ్ పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం "అని ఆయన చెప్పారు.

సంక్లిష్టమైన ప్రదేశాలలో పోలీసులు అదనపు సిబ్బందిని ఉంచుతున్నారు. అదనంగా ట్రాఫిక్ పర్యవేక్షణ బృందాలను మోహరిస్తున్నారు. వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

పండుగ రద్దీ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసు సిబ్బందికి వాహనదారాలు సహకరించాలని కోరుతున్నారు.

మరోవైపు హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరుగుతోంది.గడిచిన రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్‌ పట్టణంతో పాటు పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

మరోవైపు ఈ హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలతో… అధికారులు,పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe