నియోజకవర్గాల పునర్విభజన గురించి దేశం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 60 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో అదనంగా చేరతాయని అంచనా. తద్వారా మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119 నుండి సుమారు 179కి పెంచే అవకాశం ఉంది.

రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించవచ్చినప్పటికీ.. అసెంబ్లీ స్థానాల కేటాయింపులో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య 29 నుండి 45కి పెరుగుతుంది. ఇందులో హైదరాబాద్కు 20 స్థానాలు, మేడ్చల్-మల్కాజిగిరికి 13, రంగారెడ్డికి 12 స్థానాలు దక్కుతాయి. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఎనిమిది స్థానాల చొప్పున వచ్చే అవకాశం ఉంది.
జనాభా ఒక్కటే నియోజకవర్గాల పునర్విభజనకు ప్రామాణికమని, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు అటుఇటుగా సమాన జనాభా ఉండేలా ప్లాన్ చేస్తారు.
తెలంగాణ 3.50 కోట్ల జనాభాలో 54.08 లక్షల మంది ఎస్సీలు, 31.77 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా ఎస్సీ స్థానాల సంఖ్య 19 నుండి 28కి, ఎస్టీ స్థానాల సంఖ్య 12 నుండి 16కి పెరుగుతుంది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, ములుగు, నారాయణపేట వంటి కొన్ని జిల్లాలను మినహాయిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరుగుతుంది.
మహిళల రిజర్వేషన్ల విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 15 రిజర్వ్ స్థానాలను కలిగి ఉంటాయి. 2014లో విభజన సమయంలో డీలిమిటేషన్ జరిగి ఉంటే.. తెలంగాణకు 34 సీట్లు అదనంగా లభించి ఉండేవని కొందరి వాదన. 2027 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం కేవలం 2011 గణాంకాలపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా మారుస్తుంది.
{{/usCountry}}మహిళల రిజర్వేషన్ల విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 15 రిజర్వ్ స్థానాలను కలిగి ఉంటాయి. 2014లో విభజన సమయంలో డీలిమిటేషన్ జరిగి ఉంటే.. తెలంగాణకు 34 సీట్లు అదనంగా లభించి ఉండేవని కొందరి వాదన. 2027 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం కేవలం 2011 గణాంకాలపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా మారుస్తుంది.
{{/usCountry}}ఇక దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం కొత్తగా 'నియోజకవర్గాల పునర్విభజన కమిషన్'ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి 42 స్థానాల నుంచి 59కి పెరిగనున్నాయి.