అర్ధరాత్రి సజ్జనార్ పెట్రోలింగ్.. రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లిన హైదరాబాద్ సీపీ!

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రౌడీ షీటర్ల ఇళ్లకు కూడా వెళ్లారు.

Published on: Nov 24, 2025, 13:38:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. ఆన్-గ్రౌండ్ పోలీసింగ్‌ను అంచనా వేయడానికి, ప్రజా భద్రతను నిర్ధారించడానికి వెళ్లారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి సైరన్లు మోగకుండా లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆషమ్ నగర్, డిఫెన్స్ కాలనీలోని అనేక మంది రౌడీ-షీటర్ల ఇళ్లకు సజ్జనార్ వెళ్లారు. వారి గత ప్రవర్తన, ప్రస్తుత వృత్తి, జీవనశైలి గురించి ఆరా తీశారు. వారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని, సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని సూచించారు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్ పెట్రోలింగ్
హైదరాబాద్ సీపీ సజ్జనార్ పెట్రోలింగ్

సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుండి 3 గంటల వరకు కమిషనర్ లంగర్ హౌజ్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, కీలక జంక్షన్లు, సున్నితమైన ప్రదేశాలను పరిశీలించారు. టోలి చౌకిలోని హోటళ్ళు, దుకాణాలు సందర్శించారు, వ్యాపార యజమానులు అనుమతి పొందిన గంటలకు మించి పనిచేయకూడదని హెచ్చరించారు.

తనిఖీ సమయంలో సజ్జనార్ పెట్రోలింగ్ సిబ్బంది, విధుల్లో ఉన్న అధికారులతో వ్యక్తిగతంగా సంభాషించారు. పెట్రోల్ పాయింట్లు, ప్రతిస్పందన సమయాలు, సమస్య పరిష్కార ప్రక్రియలను సమీక్షించారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ జనరల్ డైరీ, నైట్ ఎంట్రీలు, డ్యూటీ రోస్టర్‌లు, హాజరు రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. రాత్రిపూట పోలీసింగ్‌ను పెంపొందించడానికి, సమర్థవంతమైన సేవలను అందించడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, ప్రతిస్పందనను మెరుగుపరచడం, రాత్రి వేళల్లో పౌరుల భద్రతను నిర్ధారించడం కోసం అని చెప్పారు.

అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్‌ను కొనసాగించాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆదేశించారు. హైదరాబాద్ భద్రతను, పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి అప్రమత్తమైన పర్యవేక్షణ, స్పందన అవసరమని పునరుద్ఘాటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More