Hyderabad Balapur Murder Case : హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఉదంతం కలకలం రేపింది. వివాహం విషయమై తలెత్తిన తీవ్ర వివాదం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన యువతే పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఒక యువకుడు ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం (ఆగస్టు 17) వెలుగుచూసింది.
హత్యకు గురైన యువతిని బీహార్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల రేహానాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అహ్మద్ సలామ్గా తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
సోమవారం ఉదయం నిందితుడు నివాసం ఉంటున్న గదిలో నుంచి అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు.
బాలాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో డయల్ 100 ద్వారా ఒక బెడ్రూమ్లో గోనె సంచిలో మృతదేహం ఉందనే కాల్ వచ్చింది. మా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని బీహార్కు చెందిన రేహానా (21)గా, నిందితుడిని అహ్మద్ సలామ్ (21)గా గుర్తించాం," అని పోలీసు అధికారి వెల్లడించారు.
ప్రాథమిక విచారణలో వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. "వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. త్వరగా పెళ్లి చేసుకోవాలని రేహానా అతడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అహ్మద్ సలామ్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో దూర్చి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం" అని పోలీసులు వివరించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.
{{/usCountry}}ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.
{{/usCountry}}