పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల షట్టర్లు లేపి దోపిడీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22 లక్షల నగదు, మూడు నాలుగు చక్రాల వాహనాలు మరియు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం వెల్లడించారు.

హైదరాబాద్ నగర పోలీసులు, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన ఈ ముఠా గుట్టును రట్టు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
"కంబైన్డ్ ఆపరేషన్లో భాగంగా పశువుల దొంగతనాలు, సెల్ ఫోన్ షాపుల షట్టర్లు లేపి చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేశాం. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల నగదు, మూడు కార్లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం," అని సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వివరించారు.
ఈ ముఠా మొదట్లో పశువుల దొంగతనాలకు పాల్పడేదని…. ఆ తర్వాత క్రమంగా మొబైల్ షాపుల్లో భారీ చోరీలకు శ్రీకారం చుట్టిందని సీపీ తెలిపారు. పశువుల దొంగతనాలకు సంబంధించి వీరిపై దాదాపు 13 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత మొబైల్ షాపుల దోపిడీలకు అలవాటు పడ్డారని సీపీ పేర్కొన్నారు.
జైలులోనే పరిచయం.. అక్కడ నుంచి నేరాలు
ఈ కేసులోని ప్రధాన నిందితులు మహమ్మద్ తబ్రేజ్, రఫీక్లకు నేర చరిత్ర ఉందన్నారు. తబ్రేజ్పై గతంలో దాదాపు 37 కేసులు ఉండగా, ఇటీవల మరో 13 కేసులు నమోదయ్యాయి. ఒక ఎన్డీపీఎస్ (గంజాయి/మత్తు పదార్థాల) కేసులో చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో అబు అలియాస్ ఫైసల్తో వీరికి పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. జైలు నుంచి విడుదలయ్యాక వీరంతా కలిసి గుజరాత్లోని సూరత్లో చోరీకి యత్నించారని, అయితే వాహన ప్రమాదం జరగడంతో ఆ ప్రయత్నం విఫలమైందని సజ్జనార్ తెలిపారు.
కమిషనరేట్ టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో… జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు మరియు ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
{{/usCountry}}కమిషనరేట్ టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో… జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు మరియు ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
{{/usCountry}}ఇదే సమయంలో…. పోలీసు శాఖ అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ గురించి సీపీ సజ్జనార్ వివరించారు. బాధితులు తమ ఫిర్యాదులను ఏ భాషలోనైనా సులభంగా ఇచ్చేలా హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లలో ‘ట్రయాజ్ యూనిట్’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
"పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా తమ సొంత మాటల్లో చెప్పుకునేలా ఈ ట్రయాజ్ యూనిట్ పనిచేస్తుంది. ఇది తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ సహా తొమ్మిది రకాల భాషలకు సపోర్ట్ చేస్తుంది. బాధితులు చెప్పిన స్టేట్మెంట్ను వెంటనే రికార్డ్ చేసి రిసెప్షన్ కానిస్టేబుల్కు పంపుతాం. అక్కడ అదనపు వివరాలు సేకరించి, ఆన్లైన్ ద్వారా ఎస్ఐ అడ్మిన్కు నివేదిస్తాం. వారు తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు కేసును కేటాయిస్తారు" అని సీపీ వివరించారు.