నేను నిర్దోషిని.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్!
పోక్సో కేసులో బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలకు ఇప్పటికే వారం రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషినని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్పై హైకోర్టు జులై 1 విచారణ జరపనుంది.

25 ఏళ్ల సాయి భగీరథ్.. తాను చదువుతున్న మహీంద్రా యూనివర్సిటీలో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు పోక్సో కోర్టు నుండి వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ పొందాడు. పరీక్షలు ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం జూన్ 25న తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారంలో అధికారుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నాడు.
హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్హౌస్లో 17 ఏళ్ల తన మైనర్ కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణలో భాగంగా మే 12న ఈ కేసులో తీవ్రమైన లైంగిక దాడి సెక్షన్లను జోడించారు. బాధితురాలిపై పదే పదే దాడికి పాల్పడినందుకు సంబంధించిన కఠినమైన పోక్సో నిబంధనలను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు.
మరోవైపు సాయి భగీరథ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. బాధితురాలి కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, అందుకు తాను నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ రూ. 5 కోట్లు డిమాండ్ (Extortion) చేశారని ఆరోపిస్తూ ఆయన ఎదురు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. తర్వాత బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఇక తాజాగా మరోసారి బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పూర్తిగా నిర్దోషిని. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాను.' ఈ క్రమంలో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


