తెలంగాణలో రూ. 500 కోట్లతో ఐకానిక్ టూరిస్ట్ సెంటర్.. ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒకటి!

తెలంగాణ పర్యాటక శాఖ, కేంద్ర ప్రభుత్వ నిధులను సమీకరించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా వికారాబాద్, యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలిసింది.

Published on: Jun 6, 2026, 06:54:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో పర్యాటకరంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక జోన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వికారాబాద్, యాదగిరిగుట్ట, మరియు నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

తెలంగాణ
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డెవలప్‌మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్’ (అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి) ప్రాజెక్టు కింద ఈ మూడు ప్రాంతాలలో ఒకదానిని ఎంపిక చేయనున్నారు. వికారాబాద్, యాదగిరిగుట్ట, నాగర్జునసాగర్‌లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇందులోని ఎంపికైన ఆ ఒక్క పర్యాటక కేంద్రాన్ని సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో "ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్" ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేని, అత్యంత సులువైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఇక్కడ అత్యాధునిక వసతులు, ఏర్పాట్లను కల్పించనున్నారు.

వికారాబాద్ ప్రకృతి అందాలు, పచ్చదనం, ట్రెక్కింగ్, బోటింగ్ వంటి వసతులతో ఇప్పటికే ఇది ఎకో-టూరిజం స్పాట్‌గా విశేష ప్రజాదరణ పొందింది.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట, ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో తన సంస్కృతి, సంప్రదాయాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బుద్ధవనం నాగార్జున సాగర్ వద్ద 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ఇది. ఇక్కడికి వివిధ దేశాల నుండి పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

ఎంపిక చేసిన ఐకానిక్ పర్యాటక కేంద్రాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక మేనేజ్‌మెంట్ బాడీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా ఆ పర్యాటక కేంద్రం పరిపాలన, సందర్శకుల నిర్వహణ, వసతుల కల్పన మరియు నిరంతర అభివృద్ధి కార్యకలాపాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది.

గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ టూరిజం గవర్నెన్స్ అథారిటీ' తరహాలోనే తెలంగాణలోని ఈ మేనేజ్‌మెంట్ బాడీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ పరిపాలనా బాధ్యతలను ఒక సీనియర్ ర్యాంక్ అధికారికి అప్పగించనున్నారు.

ప్రయాణికులకు పూర్తి అనుభవం ఎలాంటి ఆటంకాలు లేకుండా, అవాంతరాలు లేకుండా ఉండేలా అత్యాధునిక సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More