తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను వాతావరణం అయోమయానికి గురిచేస్తోంది. భిన్నమైన వాతావరణం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం ఎండ దంచికొట్టగా.. రాత్రివరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాల రాకతో కొన్ని ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత, వడగాల్పులు జనాన్ని బేజారెత్తిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో రుతుపవనాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడనున్నాయి.
మరోవైపు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చందానగర్, కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, మియాపూర్, కేపీహెచ్బీ, నాంపల్లి, కోఠి, మలక్పేట, సరూర్నగర్, ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్ వంటి పలు ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, రాత్రి వేళ ఇళ్లకు వెళ్లే ఆఫీస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోనూ వానలు
నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక బలమైన తుఫాను వలయం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
{{/usCountry}}నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక బలమైన తుఫాను వలయం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
{{/usCountry}}మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వూంతనాల్లో గానీ నిలబడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.