...
...
Next Story

జూన్ 30వ తేదీన తెలంగాణలో భారీ వర్షాలు.. మూడు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 30వ తేదీన మూడు జిల్లాల్లో అధిక వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Published on: Jun 29, 2026, 15:47:54 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో జూన్ 30వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు

ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే ప్రమాదం ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పిడుగులు, గాలులతో కూడిన వర్షం కూడా కురుస్తుందని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా సాగునీటి పారదల, రవాణా, విద్యుత్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని రోజుల నుండి వానలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐఎండి ప్రకారం, వచ్చే కొన్ని రోజులలో రాష్ట్రవ్యాప్తంగా వానల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వాతావరణ సమాచారం ప్రకారం 33 జిల్లాల్లో 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి.

భారత వాతావరణ శాఖ ప్రకారం పలు జిల్లాలకు ఏడు రోజుల ఎల్లో అలర్ట్ కొనసాగించింది. వాతావరణ సూచన ప్రకారం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe