రుతుపవనాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పుంజుకుంది. రుతుపవన ద్రోణి తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, వాతావరణం చల్లబడనుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తుంపర్లుగా వానపడుతూనే ఉంది. సాయంత్రానికి చల్లని గాలులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియరెన్స్ పనులను చేపట్టాయి. శుక్రవారం
ఉత్తర తెలంగాణలో పలు పజిల్లాల్లో వానలు ఎక్కువగా పడనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎల్నినోపై అప్రమత్తం
ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఏర్పాటు చేసిన 27 మంది నిపుణుల కమిటీ తొలి సమావేశం ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది.
భారత వాతావరణ శాఖ(IMD), ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఐఐఎంఆర్, ఐఐఓఆర్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 30 శాతం వర్షపాతం లోటు నమోదైందని, 33 జిల్లాల్లో 23 జిల్లాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయని సమావేశంలో వెల్లడించారు.
{{/usCountry}}భారత వాతావరణ శాఖ(IMD), ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఐఐఎంఆర్, ఐఐఓఆర్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 30 శాతం వర్షపాతం లోటు నమోదైందని, 33 జిల్లాల్లో 23 జిల్లాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయని సమావేశంలో వెల్లడించారు.
{{/usCountry}}జిల్లా, మండలాల వారీగా వర్షపాతం, పంటల విస్తీర్ణం, వాతావరణ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయ విశ్లేషణ చేపడుతున్నట్లు కమిటీ తెలిపింది. నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, శాస్త్రీయ సూచనలతో ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొవచ్చని కమిటీ అభిప్రాయపడింది.