WhatsApp Weather Alert : వాట్సాప్లోనే వాతావరణ హెచ్చరికలు.. ఐఎండీ నుంచి నేరుగా ఫోన్లోకే అప్డేట్స్
WhatsApp Weather Alert : భారత వాతావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా వాతావరణ అలర్ట్స్ అందిచనుంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.
తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు వాతావరణ ముందస్తు సమాచారం, అత్యవసర హెచ్చరికలను అత్యంత వేగంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న అడుగు వేసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రారంభించిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) లో భాగంగా, ఇకపై పంచాయతీ స్థాయిలోనే నేరుగా వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించనున్నారు.

బుధవారం (జూలై 22, 2026) లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ నూతన విధానం ద్వారా పంచాయతీ సభ్యులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు వాతావరణ వివరాలు, వ్యవసాయ సలహాలు వాట్సాప్ ద్వారా ఆటోమేటిక్గా అందుతాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుపాట్లు, తీవ్రమైన ఎండలు, హీట్ వేవ్స్ సమాచారం గ్రామీణ ప్రాంతాలకు క్షణాల్లో చేరుతుంది.
దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పంచాయత్ మౌసమ్ సేవా పోర్టల్ను ఈ-గ్రామ్ స్వరాజ్ (e-GramSwaraj), మేరీ పంచాయత్ యాప్, ఈ-మాప్చిత్ర, మౌసమ్గ్రామ్ వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించారు. మారుమూల రైతులకు ఈ వివరాలు చేరవేసేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కృషి సఖులు, పశు సఖుల నెట్వర్క్ను కూడా ఐఎండీ వినియోగించుకుంటోంది.
హైదరాబాద్లోని వాతావరణ కేంద్రంలో ఎస్-బాండ్ డాప్లర్ వెదర్ రాడార్ (Doppler Weather Radar) పనిచేస్తోందని, ఇది 250 కి.మీల ఎఫెక్టివ్ రేంజ్, 500 కి.మీల గరిష్ట పరిధితో తెలంగాణలోని అన్ని జిల్లాలకు పరిశీలన రక్షణ ఇస్తుందని మంత్రి తెలిపారు. దీనికి అదనంగా విశాఖపట్నం, మచిలీపట్నం, షోలాపూర్, నాగ్పూర్ రాడార్లు కూడా ఉపయోగపడుతున్నాయి.
తెలంగాణలోని ప్రస్తుత వాతావరణ మౌలిక వసతులు చూసుకుంటే.. హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 3 మానవీయ ఉపరితల పరిశీలనా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, రామగుండంలలో 2 రేడియో సోండే కేంద్రాలు ఉండగా... 31 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), 52 ఆటోమేటిక్ రెయిన్ గేజ్లు (ARG) ఉన్నాయి.
జిల్లాల వారీగా 369 వర్షపాత మాపక కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. రైతులకు ప్రతి వారం మంగళవారం, శుక్రవారం రోజుల్లో పంటలు, వాతావరణంపై ఐఎండీ ప్రత్యేక హెచ్చరికలు, అగ్రికల్చర్ బులెటిన్లను విడుదల చేస్తుంది. నిజామాబాద్, జగిత్యాల వంటి ప్రధాన వ్యవసాయ జిల్లాల్లో వరి, పసుపు, జొన్న వంటి పంటలకు సంబంధించి ప్రత్యేకంగా 7 రోజుల ముందస్తు సూచనలు రోజుకు మూడుసార్లు, స్థానిక నౌకాస్ట్లు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ హెచ్చరికలు అందడం వల్ల రైతులు పంట నష్టాన్ని నివారించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


