Vinayakan: ఎనిమిదేళ్ల బాలిక ఫొటోతో వివాదం- జైలర్ విలన్ వినాయకన్పై పోలీస్ కేసు- వాట్సాప్ మెసేజ్ తెచ్చిన గొడవ!
Jailer Actor Vinayakan Alleged 8 Years Old Girl Photo: సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్లో విలన్గా మెప్పించిన మలయాళ నటుడు వినాయకన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటోతో ముదిరిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో వినాయకన్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
Jailer Actor Vinayakan Alleged 8 Years Old Girl Photo: సినిమాల్లో విలనిజంతో మెప్పించే మలయాళ నటుడు వినాయకన్ నిజజీవితంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారు. రజనీకాంత్ 'జైలర్' సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీకి బాగా సుపరిచితమైన రీల్ విలన్ వినాయకన్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం ముసురుకుంది.

ఎనిమిదేళ్ల చిన్నారి ఫొటో
ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటోను, ఆమె తండ్రి మొబైల్ నెంబర్ను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేసి వినాయకన్ తీవ్ర వేధింపులకు కారణమయ్యారంటూ కేరళలోని మావేలిక్కర పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను (Child Rights Commission) సదరు బాలిక తండ్రి ఆశ్రయించడంతో ఈ దారుణమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి నుంచి వచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం రాత్రి వినాయకన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
వాట్సాప్ మెసేజ్ తెచ్చిన గొడవ
పోలీస్ రికార్డుల ప్రకారం.. 2025 జూలై 23న రాత్రి వినాయకన్కు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వినాయకన్కు వ్యతిరేకంగా ఎవరో ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ను సదరు బాధితుడు ఆయనకు వాట్సాప్ ద్వారా ఫార్వార్డ్ చేశారు. ఆ మెసేజ్ చూసి తీవ్ర ఆగ్రహానికి లోనైన వినాయకన్ బాధితుడిపై పగ పెంచుకున్నారు.
జూలై 24 తెల్లవారుజామున ఆ వాట్సాప్ మెసేజ్ స్క్రీన్షాట్తో పాటు, బాధితుడి ప్రొఫైల్ ఫోటోను కూడా స్క్రీన్షాట్ తీశారు. అయితే ఆ ప్రొఫైల్ ఫోటోలో బాధితుడితో పాటు అతని ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ స్క్రీన్షాట్లను, బాధితుడి మొబైల్ నెంబర్ను వినాయకన్ ఎలాంటి అనుమతి లేకుండా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
క్షణాల్లో పోస్ట్ వైరల్
సెలబ్రిటీ ఖాతా కావడంతో ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేస్తూ బాధితుడి కుటుంబాన్ని బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియాలో కనిపించిన ఆ ఫోన్ నెంబర్ నటుడు వినాయకన్దేనని తప్పుగా భావించిన వందలాది మంది అపరిచిత వ్యక్తులు బాధితుడికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు.
"ఆ ఫేస్బుక్ పోస్ట్ వల్ల నా కుటుంబం, నా చిన్నారి తీవ్ర మానసిక క్షోభను, సమాజంలో అవమానాన్ని అనుభవించాల్సి వచ్చింది" అని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలు.. విచారణ ప్రారంభం
ఈ ఘోరమైన ఘటనపై మావేలిక్కర పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పరువు నష్టం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీయడం వంటి తీవ్రమైన సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్, కేరళ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. త్వరలోనే నటుడు వినాయకన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని, విచారణ వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్
జైలర్లో విలన్గా మెప్పించిన వినాయకన్కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు మద్యం మత్తులో ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2025 చివరలో కేరళలోని ఒక హోటల్ సిబ్బందిపై అరుస్తూ గొడవ చేసినందుకు అంచలుమ్మూడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అంతకుముందు 2024 సెప్టెంబర్లో కొచ్చి నుంచి గోవా వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బందితోనూ మద్యం మత్తులో ఘర్షణకు దిగారు. పొరుగువారితో గొడవ పడుతూ వినాయకన్ కేకలు వేసిన వీడియోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.
కేరళకు చెందిన వినాయకన్ మలయాళ, తమిళ చిత్రాల్లో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2016లో వచ్చిన 'కమ్మట్టిపాడమ్' చిత్రంలో అద్భుత నటనకు గానూ ఆయన కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
ప్రమాదంలో కెరీర్
ఇటీవల 'జైలర్', 'మార్కో' చిత్రాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, ప్రతిభ ఉన్నప్పటికీ ఇలాంటి వివాదాస్పద ప్రవర్తన వల్ల ఆయన కెరీర్ను ఆయనే ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


