ఏపీ డిప్యూటీ సీఎం మీద పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలింది అని మాట్లాడినందుకు ఇక్కడి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలది నరదిష్టి అయితే… హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్ళిపో అంటూ సీరియస్ అయ్యారు.
ఆయన మాట్లాడింది తప్పు - అనిరుధ్ రెడ్డి

“తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, కానీ ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా…? ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా…? నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూశా. మాది నర దిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు.. ఇక్కడ అన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలి” అని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
"పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి. ఏపీలో నీకు సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావ్. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు..? అంటూ అనిరుధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}"పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి. ఏపీలో నీకు సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావ్. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు..? అంటూ అనిరుధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}