హైదరాబాద్లో ఇవానా జువెల్స్.. దక్షిణాది మార్కెట్పై దృష్టి
Ivana Jewels: లగ్జరీకి సరికొత్త నిర్వచనంగా ల్యాబ్-గ్రోన్ డైమండ్, పోల్కీ జువెల్లరీ విభాగంలో సక్సెస్ సాధించిన ఇవానా జువెల్స్ హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాది మార్కెట్పై దృష్టితో తన 11వ స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 30: నవతరం ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ 'ఇవానా జువెల్స్' భారతీయ లగ్జరీ జ్యువెలరీ రంగంలో తన వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజాగా హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చింది. రాజ్భవన్ రోడ్లో కంపెనీ తన 11వ స్టోర్ను ఏర్పాటు చేసింది. వృద్ధి వ్యూహంలో భాగంగా ఇవానా జువెల్స్ దక్షిణ భారత మార్కెట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

నిర్వహణ సామర్థ్యాన్ని, బ్రాండ్ గుర్తింపును పెంచడానికి బెంగళూరుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయనుంది. "సూరత్కు చెందిన ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యమే పునాదిగా ఇవానా జువెల్స్ వారసత్వ హస్తకళకు, ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న అంతరాన్ని విజయవంతంగా భర్తీ చేస్తోంది" అని ఇవానా జువెల్స్ వ్యవస్థాపక సభ్యుడు, డైరెక్టర్ యోగిత్ జిందాల్ పేర్కొన్నారు.
అన్ని ప్రధాన నగరాల్లో విస్తరణ
డిజిటల్ బ్రాండ్గా ప్రయాణాన్ని ప్రారంభించిన ఇవానా జువెల్స్ ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, సూరత్, నోయిడా, నాగ్పూర్, మొహాలీ వంటి ప్రధాన నగరాలకు వేగంగా విస్తరిస్తూ అద్భుతమైన రిటైల్ మైలురాయిని చేరుకుంది. ఈ "ఫిజికల్+డిజిటల్" (ఫిజిటల్) మోడల్లోకి మారడం అనేది వినియోగదారులలో నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా పెళ్లి నగలు, ఆధునిక ఆభరణాల కొనుగోలుదారులకు అవసరమైన ప్రత్యక్ష అనుభూతిని అందించడంలో బ్రాండ్కు ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
"ఈ కొత్త ల్యాండ్మార్క్ లొకేషన్ ఈ ప్రాంతం పట్ల బ్రాండ్కు ఉన్న నిబద్ధతను చాటుతుంది. ఇవానా అద్భుతమైన హస్తకళను వినియోగదారులు స్వయంగా అనుభవించడానికి ఇది ఒక ప్రీమియం టచ్ పాయింట్గా నిలుస్తుంది" అని ఫ్రాంచైజీ భాగస్వామి, శిఖర్ ట్రేడింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శివకుమార్ మిత్తల్ తెలిపారు.
ల్యాబ్-గ్రోన్ డైమండ్ పోల్కీ విభాగంలో కంపెనీ మార్కెట్ లీడర్గా ఎదిగిందని ఇవానా జువెల్స్ వ్యవస్థాపక సభ్యురాలు, డైరెక్టర్ ఆయుషి జిందాల్ తెలిపారు. సంప్రదాయ భారతీయ కళాత్మకతను ల్యాబ్-గ్రోన్ రాళ్లతో మేళవించిన తొలి బ్రాండ్లలో ఒకటిగా నిలుస్తూ అద్భుతమైన హెరిటేజ్ స్టైల్ కలెక్షన్లను అందిస్తున్నట్టు చెప్పారు. ఇవి పరిమాణం, ధర విషయంలో వినియోగదారులకు ప్రయోజనం అందిస్తాయని వివరించారు. ఈ ప్రత్యేకమైన స్థానం వల్ల వినియోగదారులు నాణ్యత, హస్తకళలో ఎక్కడా రాజీ పడకుండానే అత్యున్నత శ్రేణికి చెందిన డిజైన్లను అందుకోగలుగుతున్నారని చెప్పారు.
"డిజిటల్ స్టోర్గా ప్రారంభమై పాన్-ఇండియా రిటైల్ స్థాయికి చేరుకున్న మా ప్రయాణం భారతీయ వినియోగదారుల మారుతున్న ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. సూరత్లోని మా స్వంత తయారీ కేంద్రాన్ని ఉపయోగించుకుంటూ అత్యుత్తమ విలువ కలిగిన ఐజీఐ, ఎస్జీఎల్ సర్టిఫైడ్ వజ్రాలను అందిస్తున్నాం. దక్షిణ భారత్లో.. ముఖ్యంగా రాజ్భవన్ రోడ్లో మా కొత్త స్టోర్తో విస్తరిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇక్కడ సంప్రదాయ బంగారంతో పాటు ల్యాబ్-గ్రోన్ వజ్రాల ఆధునిక కాంతిని ఆస్వాదించే పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు" అని ఇవానా జువెల్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అదితి జిందాల్ తెలిపారు.
ఇవానా జువెల్స్ అందించే ప్రతి గోల్డ్, గుర్తింపు పొందిన ల్యాబ్ గ్రేడింగ్ డైమండ్స్ ఆభరణం బీఐఎస్ హాల్మార్క్ వంటి పరిశ్రమ-ప్రామాణిక ధృవీకరణలను కలిగి ఉంటుందని శిఖర్ ట్రేడింగ్ కంపెనీ ప్రమోటర్ అనిరుధ్ మిత్తల్ తెలిపారు. కస్టమర్లలో దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించడానికి, సహజ వజ్రాల విక్రయ సంస్థల మాదిరిగానే తాము కూడా సమగ్రమైన బైబ్యాక్, ఎక్స్ఛేంజ్ పాలసీలు, ప్రొడక్ట్ వారంటీలను అందిస్తున్నట్టు ఫ్రాంచైజీ భాగస్వామి శిఖర్ మిత్తల్ పేర్కొన్నారు.
ఇవానా జువెల్స్ ప్రధాన నగరాల్లో విజయవంతంగా స్టోర్లను ప్రారంభించి దేశవ్యాప్తంగా తన ముద్ర వేసింది. గతంలో జరిగిన ప్రారంభ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్, ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ చైర్పర్సన్ సావిత్రి జిందాల్, అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎండీ రమేష్ అగర్వాల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటి మౌనీ రాయ్ ఇవానా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


