హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దట్టమైన పొగ అలుముకోవటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో మంటలు రావటంతో… కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో సీజ్ చేసిన పలు కంప్యూటర్లు కూడా కాలిపోయాయి.
ఉదయం 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా… వెంటనే బయటికి వచ్చారు. ఆఫీస్ బాయ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ… కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు మంటల దాటికి ఆహుతయ్యాయి. ఇందులో కొన్ని కీలకమైన కేసుల సమాచారం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తుండగా… పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ…. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించినట్టు తెలిపారు. ఇది చాలా పాత భవనం అన్నారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డ్ వద్ద షార్ట్ సర్య్కూట్ అయినట్లు పేర్కొన్నారు. ఆ ప్లేస్ నుంచే మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందాయన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ భవనాలను తనిఖీ చేస్తామని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని… కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. ల్యాబ్ లోని ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
కేటీఆర్ ట్వీట్…
ఈ ప్రమాదంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు తన పోస్టులో రాసుకొచ్చారు.
ఉన్నత స్థాయి విచారణ జరగాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
{{/usCountry}}ఈ ప్రమాదంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు తన పోస్టులో రాసుకొచ్చారు.
ఉన్నత స్థాయి విచారణ జరగాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
{{/usCountry}}ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఉన్నతస్థాయి విచారణ జరగాలన్నారు.
“పోలీసు శాఖ అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు(2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా )ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారు. అమెరికాలో ఎంతో మంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు Epstein జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడు” అని ట్వీట్ చేశారు.