KNRUHS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రీఓపెన్!

KNRUHS Admissions 2026 : నీట్ అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేసింది.

Published on: Aug 19, 2026, 06:09:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విశ్వవిద్యాలయం మళ్లీ ప్రారంభించింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్

గతంలో నిర్ణయించిన గడువు ఆగస్టు 12తో ముగియగా, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విండోను పునఃప్రారంభిస్తున్నట్లు KNRUHS అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు క్రింది పట్టికలో పేర్కొన్న సమయాలను గమనించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఆగస్టు 18, మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఆగస్టు 20, సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.inలో చేసుకోవచ్చు.

NEET UG 2026లో నిర్ణీత కట్ ఆఫ్ స్కోరు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్‌కు అర్హులు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) స్థానిక అర్హత ఉన్న అభ్యర్థులకు వర్తిస్తుంది.

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలలతో పాటు KNRUHS అనుబంధ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లోని సీట్లను భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసే సమయంలో అభ్యర్థులు పలు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి, NEET-UG 2026 అడ్మిట్ కార్డ్ మరియు ర్యాంక్ కార్డ్,10వ తరగతి మరియు 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల మేమోలు, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (స్థానికత ధృవీకరణ కోసం), కుల ధృవీకరణ పత్రం (Caste Certificate - బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు), ఆదాయ ధృవీకరణ పత్రం లేదా ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్ (వర్తించే వారికి), ఆధార్ కార్డ్, అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం కావాలి.

దరఖాస్తుదారులు చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక సమస్యలను నివారించడానికి ఆగస్టు 20 సాయంత్రం 6:00 గంటల కంటే ముందే తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెరిట్ జాబితా విడుదలకు సంబంధించిన తదుపరి వివరాలను విశ్వవిద్యాలయం తమ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలోనే వెల్లడిస్తుంది.

గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఇది చివరి అవకాశమని, కాబట్టి అర్హులైన విద్యార్థులందరూ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More