జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నాం.. ఇక్కడ గెలుపు పక్కా - కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పక్కాగా గెలవబోతుందని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు… ఓటుతోనే దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నామని… ఇక్కడ గెలుపు పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్పేట్లో రోడ్ షోలో నిర్వహించారు.

2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. జూబ్లీహిల్స్లో కూడా మాగంటి గోపినాథ్ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్ గారు కన్నుమూశారని… ఇలాంటి పరిస్థితుల్లో మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని విమర్శించారు.
"ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరికైనా మేలు జరిగిందా ఆలోచించాలి. వృద్ధులకు కేసీఆర్ రూ. 2 వేలు పెన్షన్ ఇస్తే.. కాంగ్రెస్ రూ. 4 వేలు ఇస్తామని చెప్పారు. యువతులకు రూ. 2500 ఇస్తామని చెప్పారు ఇచ్చారా? ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
“బతుకమ్మ సమయంలో కేసీఆర్ చీరలు ఇస్తే.. ఇప్పుడు దాన్ని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అవేవి ప్రజలకు అందట్లేదు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లడుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ కట్టించారు. ఈ కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటారు.. పేదల ఇంటిపైకి బుల్డోజర్ పంపిస్తున్నారు. ఈ రెండేళ్లలోనే కొన్ని వేలమంది పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. అన్ని రకాలుగా తెలంగాణను కాంగ్రెస్ భ్రష్టుపట్టించింది. హైడ్రాను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నాశనం చేశారు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆటో అన్నలను ఇబ్బంది పెట్టారు.. రూ. 2500 సంపాదించే ఆటో అన్నలు ఇప్పుడు వెయ్యి, 1200ల కోసం కష్టపడుతున్నారు.ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. కేసీఆర్ అద్భుతంగా పనిచేసి తెలంగాణను నెంబర్ వన్ చేస్తే.. ఇప్పుడు లాస్ట్లో నిలబెట్టారు. హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు.. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా.. ? పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారు.కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి” అని కేటీఆర్ కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

