...
...
Next Story

జూబ్లీహిల్స్‌లో క్రాస్ వెరిఫై.. ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్న నేతలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్శించింది. పోలింగ్ అనంతరం వివాదం కూడా అయింది. అయితే ప్రధాన పార్టీలు విస్తృతంగా డబ్బు పంపిణీ చేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నగదు తీసుకొని ఓటు వేయని ఓటర్లను తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాయట.

Published on: Nov 13, 2025, 11:34:31 IST
Advertisement

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది. 48.47 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాలేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువే నమోదైంది.

జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్

కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా పోరాడగా, భారత రాష్ట్ర సమితి దానిని నిలుపుకోవడంపై దృష్టి పెట్టింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. ప్రధాన పార్టీలు డివిజన్లు, మురికివాడలు, అపార్ట్‌మెంట్లలో భారీగా ఖర్చు చేశాయని వార్తలు వచ్చాయి.

అనేక పార్టీల బూత్ కమిటీలు నగదు పంపిణీ జాబితాలను తయారు చేసి, తరువాత వాటిని పోలింగ్ ఏజెంట్లు నిర్వహించే ఓటర్ల జాబితాలతో పోల్చాయని తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీల కార్యకర్తలు డబ్బు తీసుకున్నా.. ఓటు వేయని వారిని గుర్తించడం ప్రారంభించారట. అనేక కాలనీలు, మురికివాడలలో స్థానిక నాయకులు డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

అపార్ట్‌మెంట్లు లేదా కాలనీల్లో డబ్బుల పంపిణీ కోసం పెద్దమనుషులను పెట్టారు. అయితే ఓటు వేయని వారి దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యత వారే తీసుకున్నట్టుగా సమాచారం. బూత్-స్థాయి బృందాలు కాలనీ పెద్దలను సంప్రదించి, కనీసం, తిరిగి చెల్లించిన నగదును కమ్యూనిటీ పనులకైనా.. ఉపయోగించాలని కోరుతున్నారట.

మధురనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సమావేశమై డబ్బును స్వీకరించి ఓటు వేయడం మానేసిన ఓటర్ల డబ్బులను సంఘానికి తిరిగి ఇవ్వాలని, అది భవన నిర్వహణకు ఉపయోగపడుతుందని నిర్ణయించిందని తెలుస్తోంది. బూత్ కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారట.

గత ఎన్నికలలో అధిక ఓటింగ్ నమోదైన ప్రాంతాలలో పార్టీలు డబ్బు పంపిణీ చేశాయి. అనేక బూత్‌లలో సగానికి పైగా ఓటర్లు నగదు అందుకున్నట్లు తెలిసింది. కొన్ని బూత్ కమిటీలు మొదట తమ సొంత పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెల్లించాయి, తరువాత బంధువులు, స్నేహితులు, తెలిసిన గృహాలు పంపించారు. అపార్ట్‌మెంట్లు, మురికివాడలలో సీనియర్ స్థానిక నివాసితులు పంపిణీ చేశారు. అయితే కింది స్థాయి నేతలు డబ్బును పంచకుండా దాచుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అనేక కాలనీల్లో ఓటు వేయని వారి గురించి విచారణలు జరిగాయి. తిరిగి వచ్చిన డబ్బును స్థానికంగా ఏవైనా చిన్న చిన్న పనులకు ఉపయోగించాలని పలువురు నేతలు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. డబ్బు తీసుకున్న వారిలో సగం మంది ఓటు వేయలేదట.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks