ఎల్పీజీ కనెక్షన్ల కోసం e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 23న ఉన్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడంతో, వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగదారులకు e-KYC లేదా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చాలా కీలకం. ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గృహ వినియోగ ధరకే ఎల్పీజీ రీఫిల్స్ను పొందడం కొనసాగించడానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల వినియోగదారులను కోరుతున్నాయి.

కొత్తగా గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్టుగా తెలుస్తోంది. e-KYC పూర్తి చేయని వారికి దీనికి సంబంధించిన సందేశం అందుతుందని అధికారులు అంటున్నారు. గణాంకాల ప్రకారం దేశంలో ఉన్న 32.97 కోట్ల మంది క్రియాశీల గృహ ఎల్పీజీ వినియోగదారులలో 1.26 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలోని వినియోగదారులలో సుమారు 82 శాతం మంది ఇప్పటికే e-KYC పూర్తి చేశారు. గడువు పొడిగింపుతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
గడువు తేదీకి ముందు తెలంగాణలోని అనేక ప్రాంతాలలో వంట గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల రద్దీని ఎదుర్కొన్నాయి. వినియోగదారులు సంబంధిత కంపెనీ యాప్ల ద్వారా కూడా e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తమ ఆధార్ నంబర్లు ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్లతో అనుసంధానించిన చాలా మంది ఈ పద్ధతినే ఎంచుకున్నారు.
ఆగస్టు 31 గడువు వరకు ఈకేవైసీ నిబంధనలను పాటించని వారికి ఏ ధరలో రీఫిల్స్ సరఫరా చేస్తారనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఆధారపడి ఉండనుంది. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు విషయాన్ని ఓఎంసీ అధికారులు మౌఖికంగా తెలియజేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేసుకుంటున్నారు.
అయితే ఈకేవైసీ పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఈకేవైసీ పూర్తి చేయకుంటే.. దాని ప్రభావం ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ మీద పడనుంది. బుకింగ్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మీకు ప్రాధాన్యత ఉంటుంది. గ్యాస్ కనెక్షన్స్ రద్దు చేయరు. కానీ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం మాత్రం ఉంటుంది. కేవైసీ లేని కనెక్షన్లను నిలిపివేస్తామని, చమురు కంపెనీల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
{{/usCountry}}అయితే ఈకేవైసీ పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఈకేవైసీ పూర్తి చేయకుంటే.. దాని ప్రభావం ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ మీద పడనుంది. బుకింగ్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మీకు ప్రాధాన్యత ఉంటుంది. గ్యాస్ కనెక్షన్స్ రద్దు చేయరు. కానీ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం మాత్రం ఉంటుంది. కేవైసీ లేని కనెక్షన్లను నిలిపివేస్తామని, చమురు కంపెనీల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
{{/usCountry}}ఎల్పీజీ ఈకేవైసీ గడువు మెుదట ఆగస్టు 16గా నిర్ణయించారు. సర్వర్ పనిచేయకపోవడం, అనేక ఇతర సాంకేతిక సమస్యలతో దానిని పెంచారు. తర్వాత ఆగస్టు 23వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 31 వరకు పొడిగించారు.