మావోయిస్టు పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో చాలా మందిని కోల్పోయిన పార్టీ.. వరుస లోంగుబాట్లతోనూ ఎదురుదెబ్బలు తింటుంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు.. 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. అయితే తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత కూడా లొంగిపోయేందుకు రెడీ అయ్యారు.

కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న.. గురువారం చత్తీస్ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాల్లో బుధవారం 43 మంది మహిళా మవోయిస్టులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కనీసం ఇద్దరు సభ్యులు సహా 78 మంది లొంగిపోయేందుకు వచ్చినట్టుగా సమాచారం. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు.
ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 40 ఏళ్ల కిందట ఉద్యమం వైపునకు ఆకర్శితులు అయ్యారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కాజీపేటలో సెకండరీ విద్య, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్యూ కోసం ఆశన్న చాలా కాలం పని చేశారు. తర్వాత నిర్బంధం పెరగడంతో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీలో ఆయన కీలక బాధ్యతలు చూసుకున్నారు.
నిజానికి మావోయిస్ట్ టాప్ కమాండర్ బసవరాజు మరణం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ పదవి రేసులో ఆశన్న కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ పార్టీ ఆ పదవిని ఆయనకు ఇవ్వలేదు. ఆశన్న అనేక విషయాల్లో సమర్థుడని పేరు ఉంది. కానీ జనరల్ సెక్రటరీ పదవి రాకపోడవంతో ఆయనతోపాటుగా కొంతమంది క్యాడర్లోనూ అసంతృప్తి నెలకొంది.
ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై కేంద్రం విరుచుకుపడుంది. చాలా మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించారు. కీలక నేతలు కూడా చనిపోవడంతో మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొంది. తర్వాత వరుసగా లొంగుబాట్లు అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేని భారత్ను చూస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
{{/usCountry}}ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై కేంద్రం విరుచుకుపడుంది. చాలా మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించారు. కీలక నేతలు కూడా చనిపోవడంతో మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొంది. తర్వాత వరుసగా లొంగుబాట్లు అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేని భారత్ను చూస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
{{/usCountry}}