మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన… పుష్ప-2 సినిమా తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పానని తెలిపారు.

ఆ తర్వాత నుంచి నన్ను ఎవ్వరూ కలవడం లేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని గుర్తు చేశారు. బాబు ట్రీట్మెంట్ కు కూడా తాను డబ్బులు ఇచ్చానని… ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
రాజాసాబ్, చిరంజీవి సినిమాల బెనిఫిట్ షో టికెట్స్ ధరలు తాను పెంచలేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధం లేదని.. ఆ మెమోలను ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.
మరోవైపు ఆయనపై కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “నాకు ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి వాడి పేరు మీద ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు చేశా, ఇప్పటికీ చేస్తున్నా. నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారిపై ఇష్టమొచ్చినట్లు రాసి ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుంది. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా"అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
"తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశా. అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశా. నా కొడుకుని కోల్పోయినప్పుడే సగం చనిపోయా. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. అయినా ఏది పడితే అదే రాస్తాం అంటే పైనా ఆ దేవుడు చూసుకుంటాడు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
{{/usCountry}}"తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశా. అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశా. నా కొడుకుని కోల్పోయినప్పుడే సగం చనిపోయా. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. అయినా ఏది పడితే అదే రాస్తాం అంటే పైనా ఆ దేవుడు చూసుకుంటాడు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
{{/usCountry}}“నాపై కుట్ర జరుగుతోందా? లేదా? అనేది నేను చెప్పలేను. ఓ న్యూస్ ఛానెల్లో వచ్చిన వార్తపై.. డీటెయిల్ ఎంక్వైరీ జరిపిస్తాం. ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయో.. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయి” అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.