మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు ఆధునీకరణ పనులు కొనసాగుతుండగానే… మరోవైపు భక్తుల రద్దీ మొదలైంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానంగా అందగా… ఇవాళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. రాష్ట్ర మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క… స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి జాతరకు రావాలని ఆహ్వానించారు.

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న మహిళా మంత్రులకు… మాజీ ఎంపీ సంతోష్ రావు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసిన మంత్రులు… కాసేపు మాట్లాడారు. మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు.
ఆత్మీయ పలకరింపు…
ఇంటికి వచ్చిన మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సాదర ఆహ్వానం లభించింది. ‘బాగున్నారా…. అమ్మ’ అంటూ మంత్రులకు కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం చేశారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా… జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున మహిళా మంత్రులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు…. కేసీఆర్ కు మేడారం ప్రసాదం అందజేశారు.
{{/usCountry}}మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా… జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున మహిళా మంత్రులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు…. కేసీఆర్ కు మేడారం ప్రసాదం అందజేశారు.
{{/usCountry}}కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు… కాసేపు పరస్పర యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.