హైదరాబాద్ నగరంలో గుండెలను పిండేసే అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే కాలయమురాలై, నవమాసాలు మోసి కన్న తొమ్మిది నెలల పసిపాపను నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ చెరువు వద్ద ఈ ఘోరం జరిగింది.

ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన లోకసాని రాజేశ్వరి (34)కి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన లోకసాని రవీందర్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా ఎల్బీనగర్ సమీపంలోని ఇంజాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి తొమ్మిది నెలల వయసున్న 'అనురాధ' అనే కూతురు ఉంది. రవీందర్ రెడ్డి బటాసింగారం పండ్ల మార్కెట్లో హమాలి (కూలీ)గా పనిచేస్తుండగా, రాజేశ్వరి గృహిణిగా ఉంటోంది.
ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా రాజేశ్వరి పలుమార్లు తన పసిపాపను తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేది. రెండు మూడు రోజుల పాటు బయటే ఉండి తిరిగొచ్చేదని, ఈ విషయమై దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని పోలీసుల విచారణలో తేలింది.
ఆదివారం సాయంత్రం కూడా గొడవ జరిగిన అనంతరం రాజేశ్వరి కల్లు సేవించి, తీవ్ర మత్తులో తన తొమ్మిది నెలల కూతురు అనురాధను తీసుకుని బైరామల్గూడ చెరువు వద్దకు వెళ్ళింది. ఏ మాత్రం మానవత్వం లేకుండా పసిపాపతో సహా చెరువులోకి దిగి…. చిన్నారిని నీటిలో ముంచి చంపేసింది.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను అడ్డుకోవడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన తండ్రి….
{{/usCountry}}ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను అడ్డుకోవడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన తండ్రి….
{{/usCountry}}విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి రవీందర్ రెడ్డి… తన కుమార్తె నిశ్చేష్టగా పడివున్న మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కన్నతల్లే ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. కేవలం కుటుంబ కలహాలు, తాగుడు మత్తులోనే ఈ హత్య చేసిందా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.