నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూన్ 22న వెలుగుచూసిన ఈ దారుణాన్ని తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇది ఆత్మహత్య కాదు, అత్యంత క్రూరంగా జరిగిన హత్యలు అని తేలింది.
ఫోరెన్సిక్ నివేదికతో కీలక మలుపు

మృతులను ప్రకాశంబజార్లో బ్యాగుల వ్యాపారం చేసే మహ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (38), కుమారుడు ముజామిల్ (20), కుమార్తె అఫోర (14)గా గుర్తించారు. ఘటనా స్థలంలో నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడినప్పటికీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి, ప్రణాళికాబద్ధంగా వీరిని హతమార్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైంది.
ఆరుగురు సుపారీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
ఈ సామూహిక హత్యల వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నట్లు గుర్తించిన నల్గొండ పోలీసులు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆరుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన అంతర్గత గొడవలు, విలువైన ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
కుటుంబంలో కలహాలు
స్థానికుల కథనం ప్రకారం.. వ్యాపారి అయిన సుల్తాన్కు గతంలోనే మొదటి భార్య మరణించగా, హసీనాతో రెండో వివాహం జరిగింది. మరణించిన ముజామిల్(ఏసీ టెక్నీషియన్), అఫోర (7వ తరగతి విద్యార్థిని) ఇద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలు. హసీనా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. అయితే గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు నడుస్తున్నాయి. సుల్తాన్ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవారని సమాచారం.
ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆస్తిని దక్కించుకోవడానికో లేదా పాత కక్షల కారణంచేతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ ఈ నలుగురిని అంతమొందించినట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టి, పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
{{/usCountry}}ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆస్తిని దక్కించుకోవడానికో లేదా పాత కక్షల కారణంచేతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ ఈ నలుగురిని అంతమొందించినట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టి, పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
{{/usCountry}}