హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఘోరం జరిగింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్ బలవన్మరణానికి గురైన ఘటన స్థానిక సిబ్బందిని…. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు హాజరైన ఆయన…. నైట్ డ్యూటీలో భాగంగా స్టేషన్లోనే ఉన్నారు. బుధవారం ఉదయం చూసేసరికి సాయికుమార్ పోలీస్ స్టేషన్లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. అది గమనించిన తోటి సిబ్బంది వెంటనే తేరుకుని, సీనియర్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే, సాయికుమార్ ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అనంతర ప్రక్రియ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులు ఆందోళన…
మరోవైపు ఈ ఘటనపై సాయికుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. తన మృతికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉండే అవకాశం ఉందంటూ సాయికుమార్ మొబైల్ ఫోన్ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా…. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి ఎలా తరలిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర అసంతృపిని వ్యక్తం చేశారు. అసలు సాయికుమార్ మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల డిమాండ్ల నేపథ్యంలో ఎల్బీనగర్ పోలీసులు అన్ని కోణాల్లో కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
సాయికుమార్ తల్లి మాట్లాడుతూ… పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన కొడుకుని పైఅధికారులే చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. “ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుంది.. మేము రాక ముందే ఆసుపత్రికి పంపించేశారు. మాకు మృతదేహాన్ని కూడా చూపించడం లేదు. మాకు ఒక సీఐ సార్ మీద అనుమానం ఉంది.. ఆయన కనీసం బయటకు రావడం లేదు. తమకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు.
{{/usCountry}}సాయికుమార్ తల్లి మాట్లాడుతూ… పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన కొడుకుని పైఅధికారులే చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. “ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుంది.. మేము రాక ముందే ఆసుపత్రికి పంపించేశారు. మాకు మృతదేహాన్ని కూడా చూపించడం లేదు. మాకు ఒక సీఐ సార్ మీద అనుమానం ఉంది.. ఆయన కనీసం బయటకు రావడం లేదు. తమకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు.
{{/usCountry}}2024 బ్యాచ్కు చెందిన సాయికుమార్ ని.. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మన్ఘాట్లో ఫ్రెండ్స్ తో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. అతని స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అర్జున తండగా తెలిసింది.