Uppal IPL Match 2026 : ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారా..? అభిమానులకు పోలీసులు కీలక సూచనలు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకుల కోసం పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. 

Published on: Apr 5, 2026, 12:13:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ)తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం మల్కాజ్ గిరి కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు కీలక సూచనలు చేశారు.

ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారా..? అభిమానులకు పోలీసులు కీలక సూచనలు (image from @SunRisers)
ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారా..? అభిమానులకు పోలీసులు కీలక సూచనలు (image from @SunRisers)

ప్రేక్షకులకు కీలక సూచనలు:

  • ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు ఫిజికల్ టికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలా అయితేనే లోపలికి అనుమతిస్తారు.
  • పవర్ బ్యాంకులు, బ్యాగులు, హెల్మెట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా పెన్లు కూడా స్టేడియం లోపలికి అనుమతించరు.
  • మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. గేట్లు మధ్యాహ్నం 12:30 నుంచే తెరుచుకుంటాయి. ఫాన్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని నిబంధనలు పాటిస్తూ స్టేడియంలోకి వెళ్లాలి.
  • హెల్మెట్ పార్కింగ్ వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే స్టేడియం ఎంట్రీ వద్దే ఆపివేస్తారు.
  • మొబైల్ ఫోన్, కొంత క్యాష్ కూడా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్టేడియం పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ పేమెంట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్తపడటం మంచిదని హెచ్చరిస్తున్నారు.
  • గేట్ నెం. 1 ప్రత్యేకంగా ఆటగాళ్ల కోసం కేటాయించారు. టిక్కెట్ల కేటాయింపు ప్రకారం ప్రేక్షకులు నిర్దేశిత గేట్ల ద్వారానే ప్రవేశించాలి.
  • బయటి ఆహారం వంటి వస్తువులను ప్రేక్షకులు తీసుకురావడం నిషిద్ధం. ప్రతి గేట్ వద్ద మొబైల్-తనిఖీ సాంకేతిక నిపుణులుంటారు.
  • ఇవాళ మ్యాచ్ ఉండటంతో ఈ రూట్ లో ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్సులతో సహా భారీ వాహనాల కోసం దారి మళ్లింపులను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
  • ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న కీలక మార్గాలలో ఆంక్షలు అమలు అవుతాయి. ఏప్రిల్ 5న మధ్యాహ్నం 12.00 గంటల నుండి రాత్రి 23.50 గంటల మధ్య, ఉప్పల్ మీదుగా నాగోల్ నుండి హబ్సిగూడకు, బోడుప్పల్ నుండి అంబర్‌పేట్‌కు వెళ్లే మార్గాలలో రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
  • మ్యాచ్‌కు వచ్చే అభిమానులు పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
  • నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ చేయాలి. అయితే స్టేడియం పార్కింగ్‌లోకి పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పాస్‌లు లేని వాహనాలను కీలక చెక్‌పాయింట్లు దాటి అనుమతించరు.

ట్రాఫిక్ ఆంక్షలు:

మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ ఉప్పల్ రూట్లలో ట్రాఫిక్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. నాగోల్ నుంచి హబ్సిగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు…… బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి.

తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, హయత్ నగర్, ఎల్‌బీ నగర్ వైపు మళ్లిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More