జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే ఓ గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. నిందితుడు హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (19)ని హరిబాబు అనే వ్యక్తి కొద్ది నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వైష్ణవి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉంది. ఇంతలో మంగళారం ఆమె ఇంట్లో రక్తపు మడగులో పడిపోయి ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించి… పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తండ్రి ఎస్ఆర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి చిత్తారి హరిప్రసాద్ ను అరెస్ట్ చేశారు. హరిప్రసాద్ తన భార్యను గొంతు కోసి ముఖంపై పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ జంటకు వివాహం జరిగి సుమారు పది నెలలు గడిచాయి. వైష్ణవిని భర్త హరిప్రసాద్ తో పాటు అతని తల్లి, సోదరుడు వరకట్న వేధింపులకు గురి చేశారని తండ్రి ఆరోపించారు.
ఈ కేసులో హరిప్రసాద్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అయితే అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవాళ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
సోషల్ మీడియా వీడియోల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని ప్రచారం జరిగుతోంది. అయితే హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో అత్తగారి ఇంట్లోనే ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. వైష్ణవి హత్యకు వ్యూస్ కోసం పోస్ట్ చేసిన వీడియోలు కారణమా..,,? లేక వరకట్నం కోసం వేధించి హత్య చేశాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.