Andhrapradesh : 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ - 90 రోజుల్లో విధివిధానాలు
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బ్యాన్ పెట్టాలని నిర్ణయించింది.13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు.

90 రోజుల్లో విధివిధానాలు - సీఎం చంద్రబాబు
ఐటీ శాఖ మంత్రి సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి తనంపై ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. 13 ఏళ్ల వయసు లోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని…. బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది జనవరిలోనే ఈ విషయంపై ఐటీ మంత్రి లోకేశ్ పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూడా ఆస్ట్రేలియా మాదిరి చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా సబ్ కమిటీ ఏర్పాటు చేసి… పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఈ విషయంపై ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల కోసం టిక్ టాక్, ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్ మరియు థ్రెడ్స్ ను నిషేధించింది. గతేడాది డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సదరు కంపెనీలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. కొన్ని ఫ్లాట్ ఫామ్స్ కు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయించారు.
ఇక ఏపీలో కూడా విధి విధానాలు ఖరారైన తర్వాత… ఆయా సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే విధివిధానాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలిసిపోనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











