తెలంగాణలో ఆటో రిక్షాల ప్రయాణ ఛార్జీలను పెంచాలని రవాణా శాఖ నియమించిన అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కొత్తగా ప్రతిపాదించిన రేట్లతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కమిటీ ప్రతిపాదించిన కొత్త ఆటో ఛార్జీల వివరాలు

కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ. 30. మొదటి 1.6 కి.మీ. దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 14. వెయిటింగ్ ఛార్జీలు నిమిషానికి 75 పైసలు. రాత్రి వేళల్లో సాధారణ ఛార్జీ కంటే 50 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది.
ఛార్జీల పెంపునకు కారణాలు
గడిచిన 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఆటో ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని, అందుకే ప్రస్తుతం ఛార్జీలను పెంచడం అనివార్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ సిఫార్సులు చేయడానికి కమిటీ పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుంది.
ఆటో కొనుగోలు ధర, 70శాతం బ్యాంక్ రుణం, డ్రైవర్ నెలవారీ వేతనం (రూ. 25,000), ప్రతిరోజూ ఆటో తిరిగే సగటు దూరం (163.8 కి.మీ) వంటి అంశాలను లెక్కించారు. ఆదాయం ఇచ్చే ప్రతి కిలోమీటరుకు నిర్వహణ ఖర్చు రూ. 13.53గా తేలడంతో ఆ ధర ఆధారంగా కిలోమీటరుకు రూ. 14 వసూలు చేయాలని సూచించారు.
పెట్రోల్/గ్యాస్ ధరలతో పాటు వాహన ఇన్సూరెన్స్, ఇతర వ్యయాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. ఛార్జీల ఖరారుకు ముందు రవాణా శాఖ అధికారులు కేరళ, ఢిల్లీ, కర్ణాటక (బెంగళూరు), మహారాష్ట్ర (ముంబై) రాష్ట్రాల్లోని ఆటో ఛార్జీల విధానాలను సమగ్రంగా అధ్యయనం చేశారు.
ప్రభుత్వ హామీ
మొత్తం 14 డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆగస్టు 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన చర్చల్లో 15 రోజుల్లోగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆటో యూనియన్లు తమ సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నాయి. ఆ మాట ప్రకారమే కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది.
{{/usCountry}}మొత్తం 14 డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆగస్టు 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన చర్చల్లో 15 రోజుల్లోగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆటో యూనియన్లు తమ సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నాయి. ఆ మాట ప్రకారమే కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది.
{{/usCountry}}