Ration Card Cancel : వారికి కచ్చితంగా రేషన్ కార్డు క్యాన్సిల్.. తెలంగాణ సర్కార్ హెచ్చరిక
Ration Card Cancel : రేషన్ కార్డు గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం అందిస్తున్న పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.
ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి రేషన్ కార్డులను తక్షణమే రద్దు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుటాని తండాలో నిర్వహించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని్ అమ్ముకునేవారిని హెచ్చరించారు. ఈ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామన్నారు.

గుడిసెల్లో జీవించే అర్హులైన పేదలందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, పేదరికామే ప్రామాణికమని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో విఫలమైతే, బాధ్యత వహించని సర్పంచ్ల పదవులు పోతాయని తేల్చిచెప్పారు.
వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాలు తగ్గే అవకాశం ఉందని, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడవచ్చునని తుమ్మల హెచ్చరించారు. తీవ్రమైన నీటి ఎద్దడిని కూడా తట్టుకుని పెరిగే పంట ఆయిల్ పామ్ అని, కాబట్టి రైతులు పామాయిల్ సాగువైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ పంట వేసే రైతులకు అవసరమైన సబ్సిడీలు, రాయితీలు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
రఘునాథపాలెం మండలానికి సాగునీటిని విడుదల చేస్తున్నామని, పొలాలకు నీళ్లు పారించుకోవచ్చని సూచించారు. ఆర్వీఎఫ్ఆర్ పట్టాలు కలిగిన గిరిజన, గిరిజనేతర రైతులకు విద్యుత్ బోర్ల అనుమతులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మాట ఇచ్చారు.
పొలాలకు వెళ్లేందుకు వీలుగా రూ. 75 కోట్ల వ్యయంతో దాదాపు 200 డొంక రోడ్లను, గ్రామీణ లింక్ రోడ్లను నిర్మిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి ప్రాంతంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
'ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో సర్కారీ బడులను నిర్వహిస్తుంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడం సరైన పద్ధతి కాదు. విద్య ద్వారానే పేద కుటుంబాల బతుకులు మారతాయి.' అని మంత్రి తుమ్మల హితవు పలికారు.
పేదలకు అందాల్సిన బియ్యం రీసైక్లింగ్కు గురవుతుండడం, పక్కదారి పట్టడంపై ప్రభుత్వం సీరియస్గా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సంక్షేమ ఫలాలు కేవలం అర్హులైన పేదలకు మాత్రమే చేరాలనేది ప్రభుత్వ స్పష్టమైన విధానమని, ఉచిత లేదా సబ్సిడీ బియ్యాన్ని వ్యాపారులకు అమ్మే లబ్ధిదారుల వివరాలను సేకరించి, వారి ప్రాథమిక హక్కులైన రేషన్ కార్డులను సైతం రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


