గ్రేటర్ హైదరాబాద్ : బహిరంగ వేలానికి 137 రాజీవ్ స్వగృహ ప్లాట్లు - ముఖ్యమైన వివరాలు
గ్రేటర్ హైదరాబాద్లో 137 రాజీవ్ స్వగృహ ప్లాట్లను వేలం వేయనున్నారు. తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గుడలో ఈ ఫ్లాట్లు ఉన్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లో ఉన్న 137 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.

స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 137 ఓపెన్ ప్లాట్లను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ప్రకటించారు.
ఆసక్తిగల వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్పష్టమైన ల్యాండ్ టైటిల్ ఉంటుంది. మంచి కనెక్టివిటీతో పాటు ప్రాథమిక మౌలిక సదుపాయాలతో కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర చదరపు గజానికి రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. దరఖాస్తులతో పాటు EMD చెల్లింపులను మీసేవా / ఆన్లైన్ / UPI / DD ద్వారా చేయవచ్చని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం https://swagruha.telangana.gov.in/ais/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు .
- తొర్రూరు - 105 ఫ్లాట్లు
- బహుదూర్ పల్లి – 12 ఫ్లాట్లు
- కుర్మల్ గూడ – 20 ఫ్లాట్లు
గత కొంతకాలంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ లే అవుట్ లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటం తోపాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

