Retired IPS Vinay Ranjan Ray Wife Murder : జుబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో దారుణం చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య భార్య తనూజ (55) తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు… వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలను సేకరించి… దర్యాప్తును వేగవంతం చేశారు.

వినయ్ రంజన్ రాయ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక విభాగాల్లో ఐపీఎస్ అధికారిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈ దంపతులు జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లోని ఐఏఎస్ క్వార్టర్స్లో నివసిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం…..పనిమనిషి కల్పన ఈ హత్యలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తించారు. కల్పన మరో ఇద్దరితో కలిసి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడినట్టు సమాచారం. ఆ తర్వాత ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని ముగ్గురు నిందితులు పరారైనట్టు పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన వెంటనే జుబ్లీహిల్స్ పోలీసులు. ఉన్నతాధికారులు క్వార్టర్స్కు చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ప్రాంతం కావడంతో ఇక్కడ నిరంతరం నిఘా, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అయినప్పటికీ ఇంతటి సాహసానికి నిందితులు ఎలా ఒడిగట్టారనేది మిస్టరీగా మారింది. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఘటనాస్థలికి సీపీ సజ్జనార్
హత్య సమాచారం అందుకున్న వెంటనే సీపీ సజ్జనార్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన….నేపాలీ పనిమనుషులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెల్లవారుజామున నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఐపీఎస్ అధికారి భార్య తనూజను హత్య చేశారని వివరించారు.నిందితులను పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని… త్వరలోనే కేసును చేధిస్తామని చెప్పారు.