స్థానిక ఎన్నికల తర్వాత 'భూదార్' కార్డుల పంపిణీ - మంత్రి పొంగులేటి

భూ హ‌క్కుల నుంచి రిజిస్ట్రేష‌న్ల వ‌ర‌కు స‌మూల మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.ఒకే డిజిటల్ గొడుగు కింద‌కు ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ సమాచార సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.స్థానిక ఎన్నికల తర్వాత భూధార్ కార్డులను అందజేస్తామని ప్రకటించారు.

Published on: Dec 4, 2025, 05:08:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వచ్చే జన‌వ‌రి నెలాఖ‌రుక‌ల్లా రెవెన్యూ, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల స‌మాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిట‌లైజేష‌న్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే NIC త‌గు క‌స‌ర‌త్తు చేస్తోందన్నారు.

భూధార్ కార్డుల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన
భూధార్ కార్డుల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన

భూదార్ కార్డుల పంపిణీపై ప్రకటన

రాష్ట్రంలో న‌క్షాలు లేని 413 గ్రామాల్లో స‌రిహ‌ద్దుల‌, భూధార్ నెంబ‌ర్ల కేటాయింపు వంటి ప్ర‌ధాన అంశాల‌తో కూడిన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌యోగాత్మ‌కంగా ఐదు గ్రామాల‌ను ఎంపిక చేసి ప‌ని పూర్తి చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఐదు గ్రామాల‌కు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని… స్థానిక ఎన్నికల తర్వాత వాటిని అందజేస్తామని ప్రకటించారు. మిగిలిన 408 గ్రామాల్లో ప‌ట్ట‌ణ ప్రాంతాలు మిన‌హా 373 గ్రామాల్లో రెండ‌వ విడ‌త కింద స‌ర్వే నిర్వ‌హిస్తామని చెప్పారు. మూడ‌వ విడ‌త‌గా అన్నిజిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాల‌ను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు భూ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌లో అర్హ‌త క‌లిగిన వాటిని జ‌న‌వ‌రి నెలాఖ‌రు క‌ల్లా ప‌రిష్క‌రిస్తాం. ప్రజ‌లకు ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర‌ణీ ద‌ర‌ఖాస్తుల‌కు కూడా మోక్షం క‌ల్పించాం. అధికారం చేప‌ట్టిన‌నాటికి 2.45 ల‌క్షల ధ‌ర‌ణీ ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ త‌ర్వాత మ‌రో నాలుగు ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వీట‌న్నింటినీ ప‌రిష్కరించి ప్రజ‌ల సంతృప్తికి తొలి అడుగు వేశాం” అని మంత్రి పొంగులేటి వివరించారు.

“భూ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు ద‌శ‌ల వారీగా భూ భార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించ‌డం జ‌రిగింది. అధికారులే ప్రజ‌ల వ‌ద్దకు వెళ్లి స‌మ‌స్యల‌పై ద‌ర‌ఖాస్తుల‌ను తీసుకోవ‌డం జ‌రిగింది. అధికారంలోకి వ‌స్తే గ్రామాల‌లో రెవెన్యూ వ్యవ‌స్ధను పున‌రుద్దరిస్తామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకొని 10,954 రెవెన్యూ గ్రామాల‌ను క్లస్టర్ వారీగా విభ‌జించి జీపీవోల‌ను నియ‌మించ‌డం జ‌రిగింది” అని మంత్రి పేర్కొన్నారు.

“ఆస్తుల రిజిస్ట్రేష‌న్ కోసం స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు వ‌చ్చి గంట‌ల త‌రబ‌డి చెట్లకింద నిరీక్షించే ప‌రిస్ధితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెర‌దించాం. రాష్ట్రంలోని 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో మూడు ద‌శ‌ల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశ‌పెట్టడ‌మేగాక ఆధార్ -ఈ సంత‌కం కూడా అమ‌లు చేసి ప్రజ‌ల‌ డ‌బ్బు, స‌మ‌యం ఆదా చేశాం. ప్రజ‌ల‌కు సౌక‌ర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ స్ధాయిలో స‌మీకృత స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మించాల‌ని నిర్ణయించాం” అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

హిల్ట్ పాల‌సీపై నోరుంద‌ని ఏదిప‌డితే అది మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్ర‌భుత్వంలో మంత్రులు వారికి నచ్చిన వారికి, ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ చేశారని విమర్శించారు. వారికి అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌ను రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలుగా మార్చారని వ్యాఖ్యానించారు. తాము అలా చేయ‌లేదని… పార‌ద‌ర్శ‌కంగా క్యాబినెట్ తీర్మానం చేశామని చెప్పారు. ఆనాడు క‌న్వ‌ర్ష‌న్ చేసిన ల్యాండ్ వివ‌రాల చిట్టాను త్వరలోనే బయటపెడుతామని ప్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More