ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి టీజీఎస్ఆర్టీసీ ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయి. రూట్లకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లను కూడా అందించారు.
- హైదరాబాద్-9959226245
- నర్సంపేట-9959226293
- తొర్రూర్-9959226053
- భూపాలపల్లి-9959226707
- మణుగూరు-9959225963
- కరీంనగర్-9959225920
- మంథని-9959225923
- హన్మకొండ-9959226049
- మహబూబాబాద్-9959226054
- జనగాం-9959226050
- పరకాల-9959226051
- నిజామాబాదు-9959226016
- గోదావరిఖని-9959225922
- మంచిర్యాల-9959226004

సరస్వతీ నది అంత్య పుష్కరాలను భారీ ఎత్తున అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, నిరంతరం చల్లటి గాలినిచ్చే కూలర్లను ఏర్పాటు చేశారు. సరస్వతీ ఘాట్తో పాటు ప్రధాన ఘాట్ల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులను నిర్మించారు. జూన్ 1వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం నదీమ తల్లికి ‘సరస్వతీ నది హారతి’ కార్యక్రమం జరుగుతోంది.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరాలు జరుగుతాయి. ప్రవేశించే మొదటి 12 రోజులను 'ఆది పుష్కరాలు' అని, ఆ రాశి నుంచి నిష్క్రమించే చివరి 12 రోజులను 'అంత్య పుష్కరాలు' అని పిలుస్తారు.
ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించడం, పితృదేవతలకు తర్పణాలు/పిండప్రదానాలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తే అంతే సమానమైన ఫలితాలు, మోక్షం లభిస్తాయని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.
కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.
{{/usCountry}}కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.
{{/usCountry}}