కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్…. మరికొన్ని ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 8, 11 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. మరికొన్ని రూట్లలో నడిచే రైళ్లను కూడా పొడిగించింది.

Published on: Feb 07, 2026 5:35 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ ను నడపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని రూట్లలో ఇది వరకే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించింది.

వన్ వే స్పెషల్ ట్రైన్స్
వన్ వే స్పెషల్ ట్రైన్స్

వన్ వే స్పెషల్ ట్రైన్స్….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… ఈనెల 8,11 తేదీల్లో కాకినాడ నుంచి నర్సాపూర్ కు వన్ వే స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కాకినాడ నుంచి (ట్రైన్ నెంబర్ 07510) ఈ స్పెషల్ ట్రైన్… సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6. 40 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…

కాచిగూడ - నర్సాపూర్ మధ్య నడిచే వన్ వే స్పెషల్ ట్రైన్స్... మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ,అకివీడు భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో 3ఏసీ, చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులను కోరారు.

ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు:

కాకినాడ టౌన్ - మైసూర్ మధ్య (రైల్‌ నెంబర్‌ 07033) నడుస్తున్న ప్రత్యేక రైలును… మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతి సోమ, శుక్రవారం రాకపోకలు సాగిస్తుంది. ఇక మైసూర్‌ – కాకినాడ టౌన్‌ మధ్య రైలును కూడా మార్చి 3వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి మంగళ, శనివారం తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్…. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, యాద్‌గిర్‌, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్‌, అనంతపూర్‌, ధర్మవరం, హిందుపూర్‌, ఎలహంక, బెంగుళూరు సెంట్రల్‌, కెఎస్‌ఆర్‌ బెంగుళూరు, కనిగిరి, మాండ్యా స్టేషన్లలో ఆగుతుంది.

నరసాపూర్ – ఎస్‌ఎంవిటి బెంగళూరుకు మధ్య నడిచే ప్రత్యేక రైలును కూడా పొడిగించారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఎస్‌ఎంవిటి బెంగళూరు – నరసాపూర్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ ను మార్చి 7వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు పొడిగించారు.ఈ రైళ్ళు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, వంగోల్‌, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంటతో పాటు పలు స్టేష్లలో ఆగుతాయి