రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రెండో విడుత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు.
తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం…. మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
- రైతు భరోసా మొదటి విడత: గత నెల 23వ తేదీన ప్రభుత్వం తొలి విడత నిధులను పంపిణీ చేసింది. అప్పుడు ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని అందించారు. దీనికోసం దాదాపు రూ. 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
- రైతు భరోసా రెండో విడత: ఎల్లుండి(ఏప్రిల్ 20) జరగబోయే రెండో విడత పంపిణీలో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ విడతలో మొత్తం రూ. 5,653 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఏడాది కూడా నిర్దేశించిన తేదీల్లో కొత్త రైతుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేసి… అర్హులైన రైతులకు పంట పెట్టుబడిసాయం అందిస్తారు.
{{/usCountry}}రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఏడాది కూడా నిర్దేశించిన తేదీల్లో కొత్త రైతుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేసి… అర్హులైన రైతులకు పంట పెట్టుబడిసాయం అందిస్తారు.
{{/usCountry}}